రామ్ చరణ్ – ఉపాసన దంపతులకు ఆడబిడ్డ పుట్టింది. దీంతో ఆ ఇంట్లో ప్రస్తుతం సంబరాలు జరుగుతున్నాయి. టాలీవుడ్ తో పాటు ఫ్యాన్స్ నుంచి కూడా ఈ దంపతులకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఇక చిరంజీవి దంపతుల ఆనందానికైతే అవధులే లేవు. పెళ్లైన 11యేళ్ల తర్వాత రామ్ చరణ్ – ఉపాసనలకు బిడ్డ పుట్టడంతో తాతయ్య, నాయనమ్మలుగా వారి మరింత సంబరంగా ఉన్నారు. అయితే ఈ సందర్భంగా చిరంజీవి వారసులకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ విషయంలో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
సుశ్మిత, శ్రీజ కూతుళ్ల ద్వారా ఇంతకుముందే తాత అయ్యాడుచిరంజీవి. తన పెద్ద కూతురు సుశ్మితకు ఇద్దరు కూతుళ్లు, చిన్న కూతురు శ్రీజకు కూడా ఇద్దరు ఆడపిల్లలు. అంటే మెగాస్టార్ ఇంట్లో ఆల్రెడీ నలుగురు మనవరాళ్లు ఉన్నారన్నమాట. ఇప్పుడు రామ్ చరణ్ ద్వారా ఐదో మనవరాలు వచ్చి చేరింది. అమ్మాయి అంటే తక్కువ అని కాదు కానీ.. చరణ్ కు కొడుకు పుడతాడు అని చాలామంది భావించారు. బట్ ఆయనకు కూడా కూతురే పుట్టింది. అయినా కొణెదల ఇంటికి కొత్త లక్ష్మీ దేవి వచ్చినంత సంబురంగా ఉంది మెగా ఫ్యామిలీ.
రామ్ చరణ్ – ఉపాసనలకు 2012 జూన్ 14న పెళ్లైంది. అప్పటికే వీరు చాలాకాలంగా ప్రేమించుకుంటూ ఉన్నారు. పెద్దలను ఒప్పించి అందరి సమక్షంలోనే ఈ పెళ్లి చేసుకున్నారు. అయితే తనతో పాటు పెళ్లి చేసుకున్న హీరోలంతా ఇప్పటికే తండ్రులయ్యారు. చరణ్ కు కాస్త ఆలస్యం కావడంతో ఉపాసనను సోషల్ మీడియాలో రకరకాలుగా ట్రోల్స్ చేశారు. ఈ విషయంలో మెగాస్టార్ ను కూడా కొన్ని ఇటర్వ్యూస్ లో అడిగారు. దేనికైనా టైమ్ ఉంటుంది కదా..? ఆ టైమ్ ఇప్పుడు వచ్చింది. ఇక ట్రోలర్స్ నోటికి ఎప్పుడో తాళం పడినా.. ఇప్పటికీ మాట్లాడేవారు ఇంక అన్నీ మూసుకోవచ్చు. ఏదేమైనా కాస్త ఆలస్యంగా పుట్టే బిడ్డలపై కుటుంబం మొత్తం ఎంతటి గారాం చేస్తుందో అందరికీ తెలుసు. సో ఇక చరణ్ – ఉపాసన దంపతుల బిడ్డకు అన్నీ వైభవాలే.
If you take out the list of directors from Tollywood who have shown their ability…
The buzz of 'Kalki' has started all over the world. This movie will hit the…
Director Rajamouli made the whole world look at the Telugu film industry with the movie…
'Matka' is a period drama starring Mega Prince Varun Tej. This movie, which is being…
Some people wait for years to find success in the Telugu film industry. The young…
టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా లెవెల్ లో సత్తా చాటిన దర్శకులు లిస్ట్ ను బయటకు తీస్తే.. ముందుగా వినిపించే…