క్రేజీ మల్టీస్టారర్ కి దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్

ధనుష్, నాగార్జున, శేఖర్ కమ్ముల (డి.ఎన్.ఎస్).. ఈ క్రేజీ మల్టీస్టారర్ తాజాగా ముహూర్తాన్ని జరుపుకోవడంతో పాటు.. షూటింగ్ కూడా మొదలుపెట్టుకుంది. అసలు నాగార్జున, ధనుష్ అంటేనే వెరీ రేర్ కాంబినేషన్. అలాంటి వీరిద్దరితో సినిమాని సెట్ చేశాడు డైరెక్టర్ శేఖర్ కమ్ముల. సిల్వర్ స్క్రీన్ పై ఫీల్ గుడ్ ఎమోషన్స్ ను ఆవిష్కరించడంలో దిట్టైన శేఖర్.. ఈ క్రేజీ మల్టీస్టారర్ ను ఏ రీతిన తీర్చిదిద్దుతున్నాడనే క్యూరియాసిటీ అందరిలోనూ ఉంది.

సునీల్ నారంగ్, పుష్కర్ రామ్ మోహన్ రావులు నిర్మిస్తున్న ఈ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక కథానాయికగా నటిస్తోంది. లేటెస్ట్ గా ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఫిక్స్ అయ్యాడట. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూరుస్తున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే అఫీషియల్ గా ఈ విషయాన్ని ప్రకటించనున్నారట. దీంతో క్లాస్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల.. మాస్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ కాంబోలో రాబోతున్న ఈ ‘డి.ఎన్.ఎస్’ మూవీ ఏ రేంజులో ఉంటుందనే ఊహాగానాలు ఊపందుకున్నాయి.

Related Posts