కింగ్ నాగార్జున నటించిన ‘నా సామిరంగ‘ సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమా తర్వాత నాగార్జున ఏ ప్రాజెక్ట్స్ చేయబోతున్నాడు అనే దానిపై ఇప్పటివరకూ అధికారిక ప్రకటనలు రాలేదు. అయితే.. లేటెస్ట్ గా ‘నా సామిరంగ‘ ప్రమోషన్స్ లో తన తర్వాతి సినిమాలపై ఓ క్లారిటీ ఇచ్చాడు నాగ్.
చాన్నాళ్లుగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగార్జున నటిస్తాడనే ప్రచారం ఉంది. ఇదే విషయాన్ని నాగ్ కన్ఫమ్ చేశాడు. ఈ చిత్రం నాగార్జున, ధనుష్ కాంబోలో మల్టీస్టారర్ గా తెరకెక్కనున్నట్టు తెలుస్తోంది. ఈనెల చివరి నుంచి ఈ మూవీ షూటింగ్ మొదలవ్వనుందట. ఇక.. ఇప్పటికే అక్కినేని కాంపౌండ్ నటీనటులతో శేఖర్ కమ్ములకు మంచి అనుబంధం ఉంది. అక్కినేని యువ సామ్రాట్ నాగచైతన్యతో శేఖర్ తీసిన ‘లవ్ స్టోరీ‘ మంచి విజయాన్ని సాధించింది. గతంలో అక్కినేని అమల శేఖర్ దర్శకత్వంలో ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్‘ సినిమా చేస్తే.. సుమంత్ ‘గోదావరి‘ చిత్రంలో నటించాడు.
శేఖర్ కమ్ముల తర్వాత తమిళ దర్శకుడు నవీన్ తో ఓ మూవీకి కమిట్ అయ్యాడట కింగ్. ఆ చిత్రం షారుక్ ఖాన్ ‘పఠాన్‘ తరహాలో హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఉండబోతుందట. నవీన్ దర్శకత్వంలో రూపొందే సినిమాయే నాగార్జున 100వ చిత్రం అనే ప్రచారం జరుగుతుంది.
Padmasree Brahmanandam has been saying that even if the speed of films has slowed down,…
'Prathinidhi 2' is a special one among the films that are going to hit the…
Vikram's all-time blockbuster 'Aparichitudu' has also joined the trend of re-releases which is currently going…
Currently, all our star heroes are busy with a handful of films. He is participating…
Superstar Mahesh Babu mesmerizes the audience not only with his screen presence but also with…
Megastar Chiranjeevi was awarded the Padma Vibhushan in the Padma Awards announced on the occasion…