ఇప్పుడు ట్రెండ్ మారింది. కరోనా పుణ్యమా అని ఓటీటీలకు టైమ్ వచ్చింది. దీంతో ఓటీటీలు క్వాలిటీ కంటెంట్ అందించి.. మరింతగా చేరువయ్యేలా ప్లాన్ చేస్తుంది. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఆహా ఇది తెలుగు వారి ఓటీటీ అంటూ డిజిటల్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు. సక్సస్ ఫుల్ గా రాణిస్తున్నారు.
లెజెండరీ యాక్టర్ అల్లు రామలింగయ్య వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన అరవింద్.. ఇండస్ట్రీలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా.. బిజినెస్ మ్యాన్ గా.. డిస్ట్రిబ్యూటర్ గా కొనసాగుతున్నారు. పర్ఫెక్ట్ ప్లానింగ్ తో ముందుకెళ్లే అల్లు అరవింద్..కేవలం చిరంజీవినే కాకుండా ఇండస్ట్రీలో అందర్నీ కలుపుకొని వెళుతున్నారు.
ఇందులో భాగంగా ఎవరూ ఊహించని విధంగా నటసింహ నందమూరి బాలకృష్ణని తొలిసారిగా హోస్ట్ గా ప్రెజెంట్ చేశారు. ఆహా కోసం అన్ స్టాపబుల్ విత్ ఎన్.బి.కె అనే టాక్ షోను రూపొందించి ఓటీటీ రంగంలో సంచలనం సృష్టించారు. దీంతో అల్లు – నందమూరి ఫ్యామిలీల మధ్య బంధం మరింత బలపడింది.
ఇప్పటికే అక్కినేని కుటుంబంతో అల్లు వారికి మంచి సాన్నిహిత్యం ఉంది. ఇప్పుడు బాలయ్యతో కలిసి మెలిసి ఉంటున్న అల్లు వారు.. త్వరలోనే దగ్గుబాటి ఫ్యామిలీతో కలవబోతున్నారట.
ఇంతకీ విషయం ఏంటంటే… సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ హోస్ట్ గా అల్లు అరవింద్ ఓ రియాల్టీ షో ప్లాన్ చేస్తున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. రానా నాయుడు అనే వెబ్ సిరీస్ తో డిజిటల్ ఎంట్రీ ఇస్తున్న వెంకీ.. ఇప్పుడు ఆహా ఓటీటీ కోసం షో చేయడానికి రెడీ అయ్యారట. ఇది నిజంగా వెంకీ అభిమానులకు గుడ్ న్యూస్ అని చెప్పచ్చు. ఇప్పటి వరకు వచ్చిన రియాల్టీ షోలకు ఇది పూర్తి భిన్నంగా ఉంటుందట. ఈ షో గురించి మరింత క్లారిటీ రావాలంటే.. కొన్ని రోజులు ఆగాల్సిందే.