YS JAGAN : జగన్ పై యూవీ క్రియేషన్స్ సినిమా

కొన్ని కాంబినేషన్స్ భలే ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. అలాంటిదే ఈ కాంబినేషన్. గతంలో పాఠశాల అనే సినిమాతో మెప్పించిన దర్శకుడు మహి వి రాఘవ ఆ తర్వాత ఆనందో బ్రహ్మతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఆ గుర్తింపుతో వెంటనే తన అభిమాన నాయకుడు అయిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి లైఫ్ లోని ఓ ఇంపార్టెంట్ పార్ట్ ను రూపొందించాడు. రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రానికి ”యాత్ర” అనే టైటిల్ నే పెట్టారు.

మమ్మూట్టి రాజశేఖర్ రెడ్డిగా నటించాడు. అనసూయ, సుహాసిని, జగపతిబాబు, రావు రమేష్‌ తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం మంచి విజయాన్నే సాధించింది. అయితే అప్పట్లోనే యాత్రకు సీక్వెల్ గా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రను కూడా సినిమాగా తీస్తానని చెప్పాడు దర్శకుడు మహి వి రాఘవ.


ఆ చిత్రానికి సంబంధించిన అప్డేటే ఇది. ఈ చిత్రానికి ”యాత్ర 2″ అనే టైటిల్ ను ఆల్రెడీ ఫిక్స్ చేశారు.

తమిళ్ నటుడు అజ్మల్(రంగం ఫేమ్) జగన్ పాత్రలో నటిస్తాడు అనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు తమిళ్ సూపర్ స్టార్ సూర్యను కూడా సంప్రదించారు అనే టాక్ ఆ మధ్య వినిపించింది. కానీ ఇంకా టైటిల్ రోల్ పోషించేది ఎవరు అనే క్లారిటీ ఇంకా రాలేదు.

మొత్తంగా ఈ చిత్రానికి సంబంధించిన కదలిక పెరిగింది. అందుకు కారణం ఈ మూవీని యూవీ క్రియేషన్స్ బ్యానర్ వారు నిర్మించబోతున్నారు అనే వార్తలు రావడమే. పైగా భారీ బడ్జెట్ తోనే ఈ చిత్రాన్ని రూపొందిస్తారు అనే ప్రచారం కూడా జరుగుతోంది. మరోవైపు వీలైనం త్వరగా సినిమాను పూర్తి చేసి 2024 ఎలెక్షన్స్ కు ముందే విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారట. మరి ఈమూవీ ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి ఎన్నికల్లో ప్లస్ అవుతుందని వేరే చెప్పక్కర్లేదు.

Related Posts