పూజాహెగ్డే ఆఫర్ వెనక త్రివిక్రమ్

త్రివిక్రమ్ శ్రీనివాస్ కు ఒక్కసారి నచ్చితే వారితో ఎక్కువ కాలం ట్రావెల్ అవుతాడు. దీని వల్ల ఇద్దరి మధ్య మంచి స్నేహం కూడా ఏర్పడుతుంది. అది చేసే పనిని సులువు చేస్తుంది. అందుకే అతను తన హీరోయిన్లతో పాటు హీరోలను కూడా రిపీట్ చేస్తుంటాడు.

ప్రస్తుతం మహేష్‌ బాబుతో గుంటూరు కారం సినిమా చేస్తున్నాడు. మహేష్‌ తో గతంలో అతడు, ఖలేజా సినిమాలు చేసి ఉన్నాడు. దశాబ్దం గ్యాప్ తర్వాత వస్తోన్న సినిమా ఇది. ఈ మూవీలో ముందుగా పూజాహెగ్డేనే హీరోయిన్ గా తీసుకున్నాడు. సెకండ్ హీరోయిన్ గా వచ్చిన శ్రీ లీల వల్ల పూజా ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది.

శ్రీ లీల ఏం చేసింది అంటే ఎవరి దగ్గరా సరైన ఆన్సర్ లేదు. బట్ ఆమె విషయంలో మాత్రం రూమర్స్ వచ్చాయి. అన్ని రూమర్స్ నిజం కాదు. అలాగే నిప్పు లేకుండా పొగ రాదు. ఇక పూజాహెగ్డే టాలీవుడ్ కు గుడ్ బై చెప్పి బాలీవుడ్ కే ప్రాధాన్యం ఇస్తుందనే వార్తలు వచ్చాయి.

ఆమె కోసం కరణ్‌ జోహార్ కొన్ని ప్రాజెక్ట్స్ సెట్ చేస్తున్నాడు కూడా. అయితే మహేష్‌ మూవీ మిస్ అయిన పూజాకు సాయితేజ్ సరసన హీరోయిన్ గా ఆఫర్ వచ్చింది. మహేష్‌ నుంచి ఒక్కసారిగా సాయితేజ్ అంటే రేంజ్ తగ్గిందనే చెప్పాలి.

బట్ గుంటూరు కారం నుంచి తప్పుకోవాలన్న నిర్ణయం ఆమెదే అంటారు. అందుకే ఎవరూ ఏం చేయలేరు. అయితే సాయితేజ్ సినిమాలో ఛాన్స్ రావడానికి కారణం కూడా త్రివిక్రమ్ శ్రీనివాసే.
సాయితేజ్ హీరోగా సంపత్ నంది డైరెక్షన్ లో ఓ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రంలోనే పూజాహెగ్డే హీరోయిన్ గా ఫిక్స్ అయింది.

అయితే ఈ చిత్రాన్ని నిర్మించేది త్రివిక్రమ్ బ్యానర్ కావడం విశేషం. అందుకే తను పూజాకు ఈ ఆఫర్ వెళ్లేలా చేశాడు అంటున్నారు. అంటే పూజా వెళ్లిపోవడం వెనక తన ప్రమేయం ఏం లేదు అని ఇన్ డైరెక్ట్ చెప్పే ప్రయత్నం అనుకోవచ్చు.

అయినా ఒక హీరోయిన్ సినిమా నుంచి తప్పుకుంటే ఏ దర్శకుడైనా ఎందుకు ఫీల్ అవుతాడు. పైగా టాప్ డైరెక్టర్ అయితే అస్సలు పట్టించుకోడు. కానీ త్రివిక్రమ్ మరో అవకాశం ఇప్పించాడు అంటే అది అతని మంచి మనసుకు నిదర్శనంగానే చూడాలి.

Related Posts