ఈ సారి ఓదార్పు ‘యాత్ర

మహి వి రాఘవ.. వైవిధ్యమైన కథలతో ప్రయాణం చేస్తోన్న ఈ దర్శకుడు రీసెంట్ గా సైతాన్ అనే సి గ్రేడ్ వెబ్ సిరీస్ తీసి విమర్శల పాలయ్యాడు. బట్ అది తన క్రియేటివ్ జాబ్ లో పార్ట్ అని అవేవీ పట్టించుకోలేదు. అయితే అతను గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిన పాదయాత్ర నేపథ్యంలో యాత్ర అనే పేరుతో ఓ సినిమా చేశాడు. లెజెండరీ యాక్టర్ మమ్మూట్టి రాజశేఖర్ రెడ్డి పాత్రలో నటించాడు

. ఈ సినిమాకు విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు వచ్చాయి. అలాగే కమర్షియల్ గా కూడా వర్కవుట్ అయ్యింది. ఇక ఇప్పుడు మరో యాత్రకు శ్రీకారం చుట్టాడు మహి రాఘవ.
అప్పుడు తండ్రి చేసిన యాత్రను చూపిస్తే.. ఇప్పుడు తనయుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన యాత్రలను చూపించబోతున్నాడు. యాత్ర2 అనే టైటిల్ కూడా అనౌన్స్ చేశారు. అయితే చాలామంది భావించినట్టు..

ఇది జగన్ అధికారం కోసం చేసిన యాత్ర కాదట. 2009లో రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత.. ఆయన మరణాన్ని జీర్ణించుకోలేక చాలామంది చనిపోయారు. వారిని ఓదార్చేందుకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని ధిక్కరించి మరీ ఓదార్పు యాత్ర చేపట్టాడు జగన్. అక్కడి నుంచే ఈ సినిమా ఉంటుందట. ఆ తర్వాత 2019 వరకూ ఈ కథ ఉంటుందని చెబుతున్నాడు రాఘవ. అంటే జగన్ అధికారంలోకి వచ్చేంత వరకూ ఉంటుంది. ఈ క్రమంలో అతను కాంగ్రెస్ ను ధిక్కరించి సొంతంగా పార్టీ పెట్టడం.. అసెంబ్లీలో చంద్రబాబుతో గొడవలు.. అసెంబ్లీ నుంచి బయటకు వచ్చి మరో యాత్ర చేయడం ఆ తర్వాత అధికారం చేపట్టడం వరకూ ఉంటుందని చెబుతున్నాడు. సో.. ఇది గత ప్రభుత్వంపై విమర్శలు చేసే అవకాశాలూ ఇస్తుంది. అంటే కాంట్రవర్శీస్ కూడా ఉంటాయి. మరి వీటిని దాటుకుని జనాలను ఎలా మెప్పిస్తాడో చూడాలి.

Related Posts