నిహారిక నిర్మిస్తున్న చిత్రానికి ‘కమిటీ కుర్రోళ్లు‘ టైటిల్

నిహారిక కొణిదెల నిర్మాతగా రూపొందిస్తోన్న తొలి చిత్రానికి ‘కమిటీ కుర్రోళ్లు‘ అనే టైటిల్ ఫిక్సయ్యింది. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌ పై ప్రొడక్షన్ నెం.1 గా రూపొందుతోన్న ఈ సినిమాకి ‘కమిటీ కుర్రోళ్లు’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేస్తూ స్పెషల్ వీడియో రిలీజ్ చేసింది టీమ్. 11 మంది హీరోలు, 4 హీరోయిన్స్‌ని పరిచయం చేస్తూ ఈ చిత్రానికి యదు వంశీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఉగాది సందర్భంగా ఈ మూవీ టైటిల్ పోస్టర్ ను సుప్రీమ్ హీరో సాయి దుర్గా తేజ్ విడుదల చేసి చిత్ర యూనిట్ కి అభినందనలు తెలిపాడు.

ఈ సందర్భంగా నిర్మాత నిహారిక కొణిదెల మాట్లాడుతూ ‘మా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ మీద చేసిన తొలి సినిమా కమిటీ కుర్రోళ్లు. ఉగాది సందర్భంగా టైటిల్ పోస్టర్ విడుదల చేశాం. పోస్టర్ విడుదల చేసిన హీరో సాయి దుర్గా తేజ్‌గారికి థాంక్స్. శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ వారు కలిసి ఈ సినిమాను నిర్మించటం చాలా హ్యాపీగా ఉంది. ఇంత మంది కొత్త వాళ్లతో సినిమా చేయటం పెద్ద బాధ్యతగా భావిస్తున్నాం. సినిమాకు ‘కమిటీ కుర్రోళ్లు’ అనే టైటిల్ పెట్టాం. అలాంటి టైటిల్ ఎందుకు పెట్టామనేది సినిమా చూడాల్సిందే. యదు వంశీగారు ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. తప్పకుండా అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాం‘ అన్నారు.

చిత్ర దర్శకుడు యదు వంశీ మాట్లాడుతూ ‘టైటిల్ పోస్టర్ రిలీజ్ చేసిన సాయి దుర్గా తేజ్ గారికి థాంక్స్. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై కమిటీ కుర్రోళ్లు సినిమా చేస్తున్నాం. కొత్తవాళ్లతో ఈ సినిమా చేయటం ఆనందంగా ఉంది. ఇందులో 11 మంది హీరోలు, 4 హీరోయిన్స్‌ని పరిచయం చేస్తున్నాం. నాకు ఇచ్చిన అవకాశాన్ని నిలబెట్టుకుంటామని నమ్ముతున్నాం. షూటింగ్ పూర్తయ్యింది‘ అన్నారు

Related Posts