హ్యాట్రిక్ కాంబో రిపీట్ అవుతోంది..

ఊహించినట్టుగానే టాలీవుడ్ లో హ్యాట్రిక్ కాంబినేషన్ రిపీట్ అవుతోంది. మాస్ మహరాజ్ రవితేజ పరిచయం చేసిన దర్శకుడు గోపీచంద్ మలినేనితో మరో సినిమా అఫీషియల్ గా కన్ఫార్మ్ అయింది. గోపీచంద్ .. రవితేజ హీరోగా నటించిన డాన్ శీనుతో దర్శకుడుగా పరిచయం అయ్యాడు.

ఆ తర్వాత వీరి కాంబోలో, బలుపు, క్రాక్ వంటి బ్లాక్ బస్టర్స్ వచ్చాయి. ఈ హ్యాట్రిక్ తర్వాత మళ్లీ ఈ క్రేజీ కాంబినేషన్ లో సినిమా చేసేందుకు సిద్ధం అయింది మైత్రీ మూవీస్ బ్యానర్. ఇదే బ్యానర్ లో ఇంతకు ముందు ఈ ఇద్దరూ కలిసి క్రాక్ వంటి బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఆ కాంబో రిపీట్ అవుతుందని కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి. వాటిని తాజాగా కన్ఫార్మ్ చేసింది బ్యానర్. బ్యానర్ తో పాటు రవితేజ, గోపీచంద్ కూడా ఈ మేరకు ట్వీట్ చేసి తమ హ్యాట్రిక్ కాంబినేషన్ రిపీట్ అవుతుందని చెప్పారు.


ఇక ఇది కూడా కంప్లీట్ మాస్ ఎంటర్టైనర్ గా వస్తుందని చెబుతున్నాడు గోపీచంద్. క్రాక్ తర్వాత గోపీచంద్ మలినేని బాలకృష్ణతో వీర సింహారెడ్డి చేశాడు. ఇటు రవితేజ క్రాక్ తర్వాత ఇప్పటికే ఐదు సినిమాలు చేశాడు. వీటిలో ధమాకా, వాల్తేర్ వీరయ్య సూపర్ హిట్స్. ప్రస్తుతం ఓ రేంజ్ లో దూకుడుగా వెళుతున్నాడు రవితేజ. టైగర్ నాగేశ్వరరావు సినిమా ఈ దసరా సందర్భంగా విడుదల కాబోతోంది. నెక్ట్స్ కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్ లో రూపొందుతోన్న ఈగల్ సినిమా వచ్చే సంక్రాంతికి విడుదల అని అనౌన్స్ చేసి ఉన్నారు. మరోవైపు హరీష్‌ శంకర్ తో సినిమా ఫిక్స్ అయింది. ఇది అఫీషియల్ గా రాకముందే గోపీచంద్ తో సినిమా అనౌన్స్ అయింది. ఇక ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించబోతున్నాడు.

ఇప్పటి వరకూ ఇవి మాత్రమే అప్డేట్స్. మిగతా క్రూ ఎవరు.. హీరోయిన్ తో పాటు ఇతర ఆర్టిస్టులకు సంబంధించిన అప్డేట్స్ త్వరలోనే వస్తాయట. మొత్తంగా రవితేజ, గోపీచంద్ కలిసి డబుల్ హ్యాట్రిక్ కు శ్రీకారం చుడుతున్నారన్నమాట.

Related Posts