మాలీవుడ్ కు విస్తరించిన ‘మైత్రి’

మామూలుగా హీరోలు, దర్శకులు, హీరోయిన్లు.. ఒక భాష నుంచి మరో భాషలోకి వెళుతుంటారు. అక్కడ సినిమాలు చేస్తుంటారు. బట్ నిర్మాణ సంస్థలు మారడం మాత్రం అరుదుగా జరుగుతుంది. ఒకప్పుడు రామానాయుడు మాత్రమే తన బ్యానర్ ను అన్ని భారతీయ భాషల్లోకి విస్తరించి.. తన చిరకాల కోరిక తీర్చుకున్నారు.

ఆ తర్వాత అంతటి సాహసం ఇంకే నిర్మాతా చేయలేదు. చేయలేరేమో కూడా. బట్.. ఆ సాహసం చేస్తున్నారు అని చెప్పలేం కానీ.. ఆ దిశగా ఓ స్టెప్ వేసింది టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌసెస్ లో ఒకటైన మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్.

తెలుగులో అనేక బ్లాక్ బస్టర్ సినిమాలు నిర్మించిన ఈ బ్యానర్ తాజాగా మళయాల సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టింది. అక్కడి స్టార్ హీరో అయిన టోవినో థామస్ తో ఓ సినిమా నిర్మించబోతోంది. నడిగర తిలకం అనే టైటిల్ తో రూపొందబోతోన్న ఈ చిత్ర నిర్మాణంలో మైత్రీతో పాటు అక్కడి గాడ్ స్పీడ్ బ్యానర్ భాగస్వామిగా ఉంది.


ఇంతకు ముందు మళయాలంలోనే ‘డ్రైవింగ్ లైసెన్స్’ అనే చిత్రంతో సూపర్ హిట్ అందుకున్న జూనియర్ లాల్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయబోతున్నాడు. మళయాలంలో ఫేమస్ యాక్టర్ అయిన డేవిడ్ పడిక్కల్ పాత్రలో టోవినో థామస్ కనిపించబోతున్నాడు అని టాక్.

దాదాపు నాలుగు నెలల పాటు ఈ మూవీ షూటింగ్ జరుగుతుందట. అంటే వచ్చే యేడాదిలో విడుదలయ్యే అవకాశం ఉంది. ఇక టోవినో థామస్ సరసన భావన హీరోయిన్ గా నటిస్తోంది. మరి ఈ మూవీతో మళయాలంలో మైత్రి వారి విజయయాత్ర కొనసాగాలని కోరుకుందాం.

Related Posts