వెబ్ సిరీస్‌తో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న కీర్తి సురేశ్..?

మహానటి కీర్తి సురేశ్ వెబ్ సిరీస్‌తో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నట్టు తాజా సమాచారం. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. సౌత్ నుంచి నార్త్‌కి వెళ్ళేందుకు చాలామంది హీరోయిన్స్ ఆసక్తి చూపిస్తున్నారు. అక్కడ మార్కెట్ రేంజ్ పెద్దది కాబట్టి పాపులారిటీ కోసం ఎక్కువగా బాలీవుడ్ వైపు అడుగులు వేస్తున్నారు.

సమంత ది ఫ్యామిలీ మేన్ వెబ్ సిరీస్‌తో హిందీలోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రియమణి ఆల్రెడీ చేస్తోంది. ఇక లేడీ సూపర్ స్టార్ నయనతార ఇటీవల జవాన్ మూవీతో బాలీవుడ్‌లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చింది. రకుల్ ప్రీత్, రష్మిక మందన్న, పూజా హెగ్డే హిందీలో నిలదొక్కుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఈ జాబితాలోకి ఇప్పుడు కీర్తి సురేశ్ కూడా వచ్చి చేరిందట. బాలీవుడ్ లో ప్రముఖ నిర్మాణ సంస్థ వై ఆర్ ఎఫ్ బ్యాన‌ర్ లో ఛాన్స్ అందుకుందట. ఇందులో రాధిక ఆప్టే కూడా నటించనుందట. త్వరలో కీర్తి సురేశ్ బాలీవుడ్ ఎంట్రీకి సంబంధించిన అఫీషియల్ కన్‌ఫర్మేషన్ రానున్నట్టు తెలుస్తోంది.

Related Posts