మహేశ్ కి కథ నచ్చింది: సందీప్ రెడ్డి వంగ

ఇప్పుడు అంతా ‘యానిమల్’ మూవీ ఫీవర్ లో ఉన్నారు. దీనికి కారణం ‘అర్జున్ రెడ్డి’ తీసి సెన్షేషన్ క్రియేట్ చేసిన సందీప్ రెడ్డి వంగ డైరెక్టర్ కాబట్టి. మరో వైపు రన్‌బీర్ కపూర్, రష్మిక మందన్న హీరోహీరోయిన్స్. అందుకే, ఈ సినిమాపై ఇటు సౌత్ లో అటు నార్త్ లో భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. డిసెంబర్ 1వ తేదీ భారీ ఎత్తున రిలీజ్ అవుతున్న నేపథ్యంలో టీమ్ ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు.

ఈ నేపథ్యంలో తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సందీప్ రెడ్డి వంగని నెక్స్ట్ చేయబోయో సినిమాల గురించి అడిగారు. ఈ సందర్భంగా ఆయన నెక్స్ట్ ప్రభాస్ తో ‘స్పిరిట్’ తెరకెక్కించబోతున్నానని క్లారిటీ ఇచ్చారు. జూన్ నుంచి స్క్రిప్ట్ వర్క్ మొదలవుతుందని చెప్పారు. ఇక మహేశ్ బాబుకి కూడా నేను చెప్పిన కథ నచ్చింది. అయితే, ఈ ప్రాజెక్ట్ మొదలవడానికి టైమ్ పడుతుందని వెల్లడించారు. దీన్నిబట్టి సందీప్ రెడ్డి వంగ-మహేశ్ బాబు కాంబినేషన్ లో సినిమా