‘గేమ్ ఛేంజర్‘ నుంచి ‘జరగండి‘ పాట వచ్చేస్తుంది!

టాలీవుడ్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ కలయికలో రూపొందుతోన్న చిత్రం ‘గేమ్ ఛేంజర్‘. మూడేళ్లుగా చిత్రీకరణ దశలోనే ఉన్న ఈ సినిమా నుంచి ఇప్పటివరకూ విడుదలైంది కేవలం టైటిల్ టీజర్ మాత్రమే. ఇక.. తమన్ స్వరాలందిస్తోన్న ‘గేమ్ ఛేంజర్‘ నుంచి ఫస్ట్ సింగిల్ ‘జరగండి..‘ రాబోతుందంటూ గత ఏడాదే ప్రకటించింది టీమ్.

గత సంవత్సరం దసరా కానుకగా.. ఆ తర్వాత దీపావళి కానుకగా ఈ పాటను విడుదల చేద్దామనుకున్నారు. కానీ.. మ్యూజిక్ రైట్స్ తీసుకున్న సంస్థతో బిజినెస్ విషయంలో తేడాలొచ్చి పాటను విడుదల చేయడకుండా ఆపారానే ప్రచారం జరిగింది. ఇక.. ‘గేమ్ ఛేంజర్‘ నుంచి ఆ మోస్ట్ అవైటింగ్ ‘జరగండి.. ‘ పాటకు ఇప్పుడు సమయం ఆసన్నమైంది. రేపు (మార్చి 27) ఉదయం 9 గంటలకు ‘జరగండి..‘ పాటను విడుదల చేయబోతున్నారు. 150 థియేటర్స్‌లో ఈ పాటను ప్రత్యేకంగా ప్రదర్శించనున్నారు.

శంకర్ సినిమాల్లోని పాటల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. శంకర్ తీర్చిదిద్దే ఒక్కో పాటతో ఓ మినీ బడ్జెట్ మూవీనే తీయొచ్చు. అలాగే.. ఈ సినిమాలోని ‘జరగండి‘ పాటను ఎంతో కలర్ ఫుల్ గా భారీ బడ్జెట్ తో చిత్రీకరించాడట శంకర్. ఈమధ్య కాలంలో మోస్ట్ ఎక్స్ పెన్సివ్ సాంగ్ గా ప్రచారంలో ఉన్న ‘జరగండి‘ పాట విడుదల తర్వాత ఎలాంటి అప్లాజ్ తెచ్చుకుంటుందో చూడాలి.

Related Posts