చెల్లి విడాకులు, అన్న పెళ్లికి అడ్డంకిగా మారిందా..?

మామూలుగా ఏ ఇంట్లో అయినా చిన్న విషాదం జరిగితే వెంటనే ఓ వేడుక జరపాలి అంటారు. బట్ కొన్ని విషాదాలు మాత్రం వేడుకలను ప్రశ్నార్థకం చేస్తాయి. ప్రస్తుతం నాగబాబు ఇంట్లో ఇదే సమస్యగా కనిపిస్తోంది. అందాల రాక్షసితో తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయం అయిన లావణ్య త్రిపాఠిని ప్రేమించాడు వరుణ్ తేజ్.

ఈ ఇద్దరూ కలిసి మిస్టర్, అంతరిక్షం అనే సినిమాల్లో నటించారు. అప్పటి నుంచే ప్రేమలో ఉన్నారు. ఎప్పుడూ బయటపడలేదు. జాగ్రత్తగానే మెయిన్టేన్ చేశారు. అందుకు కారణం.. ఇంట్లో పెళ్లికి ఎదిగిన చెల్లి ఉందని వరుణ్ ఆలోచించాడు. అందుకే ముందు నిహారికకు పెళ్లి చేస్తే తనకు లైన్ క్లియర్ అవుతుందనుకున్నాడు. అదే చేశాడు. బట్ ఇదే పెళ్లి ఇప్పుడు తన పెళ్లికి సమస్యగా మారిందనే వార్తలు టాలీవుడ్ లో వినిపిస్తున్నాయి.

నిహారిక పెళ్లి తర్వాత తన ప్రేమ విషయంలో ఇంట్లో చెప్పాడట వరుణ్. కానీ నాగబాబు ఈ ప్రేమ పెళ్లికి నిరాకరించాడు అనేది అందరికీ తెలిసిందే. అయినా పట్టు వదలకుండా ప్రయత్నించారు. తండ్రిని ఒప్పించాడు. కానీ ఇదే సమయంలో నిహారిక విడాకులు తీసుకుంది. ఆమె విడాకులు తర్వాతే వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల ఎంగేజ్మెంట్ జరిగింది. అంటే విషాదం తర్వాత వేడుక అంటే ఇదే కదా..? కానీ ఈ విషయంలో ఊహించని సమస్యలు వస్తున్నాయనే టాక్ గుప్పుమంటోంది.


నిహారిక ఇంట్లో ఉండగా వరుణ్ పెళ్లి చేసుకుంటే నలుగురూ నాలుగు రకాలుగా అనుకుంటారు అనేది కొత్తగా వీరు చెప్పుకుంటోన్న వెర్షన్ అంటున్నారు. అంటే ఇప్పుడు నిహారికకు మళ్లీ పెళ్లి చేసి అప్పుడు వరుణ్‌ మూడు ముళ్లు వేయాలా అనేది కొత్త డిస్కషన్.

కానీ అందుకు నిహారిక సిద్ధంగా లేదు. దీంతో ఇటు ఈమె వ్యవహారం తేలక.. తన పెళ్లి జరుగుతుందా లేదా అనేదీ తేలక అందరి మధ్య లావణ్య త్రిపాఠి నలిగిపోతోందంటున్నారు. అందుకే ఆమె కూడా వీలైనంత త్వరగా పెళ్లి చేసుకోవాల్సిందే అని వరుణ్ తేజ్ ను బలవంతం చేస్తోందట. మరి అటు తండ్రి మాట విని ఆగాలా.. లేక ఇప్పటికే తన కోసం చాలాకాలంగా చూస్తోన్న లావణ్య మాట వినాలా అనేది తేల్చుకోలేక ఇప్పుడు వరుణ్ తేజ్ కూడా తలపట్టుకున్నాడట. ఏదేమైనా కొన్ని విషయాలు తెలియకుండానే అన్ని ఆనందాల్ని ముంచేస్తాయి.

Related Posts