డబుల్ డోస్ స్టార్ట్ అయింది..

డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, ఎనర్జిటిక్ స్టార్ రామ్ కాంబినేషన్ లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కంప్లీట్ పూరీ మార్క్ ఎంటర్టైటనర్ గా వచ్చిన ఈ చిత్రంలో నభా నటేష్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటించారు. ఈ ఇద్దరికీ కూడా సాలిడ్ బ్రేక్ ఇచ్చిందీ చిత్రం. బట్ దాన్ని నిలబెట్టుకోవడంలో ఇద్దరూ ఫెయిల్ అయ్యారనే చెప్పాలి.

మణిశర్మ సంగీతం, రామ్ డ్యాన్స్ లు అప్పట్లో హోరెత్తాయి. ఈ మూవీకి సీక్వెల్ ఉంటుందని అప్పుడే చెప్పారు. ఆ సీక్వెల్ ఇవాళ(సోమవారం) స్టార్ట్ అయింది. మరోసారి పూరీ కనెక్ట్స్ బ్యానర్ పైనే పూరీ జగన్నాథ్, ఛార్మీ నిర్మిస్తున్న సినిమా ఇది. విశేషం ఏంటంటే.. ఓపెనింగ్ తో పాటు రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశాడు పూరీ. 2024 మార్చి 8న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్టు ప్రకటించాడు.


ఇస్మార్ట్ శంకర్ లో రౌడీగా, జులాయి పాత్రలో కనిపించాడు రామ్. చివర్లో ఓ పెద్ద పోలీస్ ఆఫీసర్ బ్రెయిన్ లోని చిప్ ను అతని మెదడులో ఇంజెస్ట్ చేస్తారు. దాని ద్వారా ఆ పార్ట్ లో కొంతమంది రౌడీలను పట్టిస్తాడు రామ్. అంతే కాక తన లవర్ ను చంపిన విలన్ పైనా పగ తీర్చుకుంటాడు. ఇక ఇప్పుడు తనే పోలీస్ ఆఫీసర్ గా కనిపించే అవకాశం ఉంది.

ఇక ఈ సినిమాలో నటించే ఇతర ఆర్టిస్టుల గురించిన అప్డేట్ లేదు కానీ.. డబుల్ ఇస్మార్ట్ షూటింగ్ ఈ నెల 12నుంచే స్టార్ట్ కాబోతోంది. రిలీజ్ డేట్ చూస్తుంటే పూరీ జగన్నాథ్ ఈ సారి హడావిడీగా కాక కాస్త జాగ్రత్తగానే ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నాడు అనిపిస్తోంది. లేదంటే ఎంత పెద్ద స్టార్ అయినా మూడు నెలల్లోనే షూటింగ్ ఫినిష్ చేసే అతను ఈ మూవీ కోసం ఏకంగా తొమ్మిది నెలల వరకూ టైమ్ తీసుకుంటున్నాడంటే ఈ సారి బ్లాక్ బస్టర్ కొట్టాల్సిందే అని ఫిక్స్ అయినట్టే కదా..? అన్నట్టు లైగర్ డిజాస్టర్ అయినా.. ఈ మూవీని కూడా ప్యాన్ ఇండియన్ రేంజ్ లో విడుదల చేయబోతున్నాడు.

Related Posts