‘ధ్రువ నక్షత్రం’ ట్రైలర్ టాక్

విలక్షణ నటుడు విక్రమ్ చిత్రాలలో ‘ధ్రువ నక్షత్రం’ ఒకటి. 2016 లోనే చిత్రీకరణ మొదలుపెట్టుకున్న ఈ చిత్రం 2018 లో విడుదలవ్వాల్సి ఉంది. అయితే.. ఆర్థిక కారణాల వల్ల ఈ సినిమా విడుదలకు ఇంతకాలం పట్టింది. వెర్సటైల్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ తెరకెక్కిస్తూ నిర్మించిన ఈ సినిమా నవంబర్ 24న రిలీజ్ కు రెడీ అవుతోంది.

లేటెస్ట్ గా ‘ధ్రువ నక్షత్రం’ మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ’26/11 ముంబై ఎటాక్స్ జరిగినప్పుడు అక్కడికి ఫస్ట్ ఎన్.ఎస్.జి. చాపర్ రావడానికి బాగా లేటయ్యింది. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అని ఆ వలయంలో ఇరుక్కుపోయి నేనేం చేయలేకపోయాను’ అంటూ ఓ ఆఫీసర్ ‘ద బేస్ మెంట్’ అనే టీమ్ ను ఫామ్ చేయడం.. ఒకే మనస్తత్వం, ఒకే లక్ష్యం ఉన్న వ్యక్తులు ఈ టీమ్ లో పనిచేయడం.. వారికి టీమ్ లీడర్ గా స్పెషలిస్ట్ ఆఫీసర్ పాత్రలో విక్రమ్ ఎంట్రీ ఇవ్వడం ట్రైలర్ లో ఆకట్టుకుంటున్నాయి. చట్టానికి కట్టుబడకుండా.. గవర్న్ మెంట్ ప్రొసీజర్స్ ఏమాత్రం ఫాలో అవ్వకుండా.. 11 మందితో కూడిన ‘ద బేస్ మెంట్’ టీమ్ టెర్రరిజమ్ ను ఎలా ఎదుర్కొంది అనే కాన్సెప్ట్ తో ఈ చిత్రం రాబోతున్నట్టు ట్రైలర్ ను బట్టి తెలుస్తోంది.

Related Posts