‘జింగర్తాండ డబుల్ ఎక్స్’పై ధనుష్ రివ్యూ

బాక్సాఫీస్ వద్ద దీపావళి సందడి మొదలైంది. దీపావళి కానుకగా ఈరోజు నుంచి థియేటర్లలో సందడి చేస్తోంది ‘జింగర్తాండ డబుల్ ఎక్స్’. తొమ్మిదేళ్ల క్రితం కోలీవుడ్ లో సెన్సేషన్ సృష్టించిన ‘జిగర్తాండ’కి సీక్వెల్ ఇది. పీరియడ్ యాక్షన్ కామెడీగా కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కించిన ఈ చిత్రంలో రాఘవ లారెన్స్, ఎస్.జె.సూర్య హీరోలుగా నటించారు.

‘జింగర్తాండ డబుల్ ఎక్స్’ మూవీపై ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. అది కూడా కోలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ ధనుష్ నుంచి. ”జింగర్తాండ డబుల్ ఎక్స్’ మూవీని తాను చూశానని.. డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ ఈ సినిమాని చాలా బాగా తీశాడని.. ఎస్.జె. సూర్య కి అద్భుతంగా నటించడం అలవాటైపోయిందని.. లారెన్స్ లో మరో పార్శ్వాన్ని చూడబోతున్నారని.. ఇక.. సంతోష్ నారాయణ్ సంగీతం బాగుందని.. చివరి 40 నిమిషాల సినిమా మీ మనసులు దోచుకుంటుందని’ ఈ సినిమా గురించి ట్వీట్ చేశాడు ధనుష్. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

Related Posts