బేబీ కూడా సెంటిమెంట్ ను ఫాలో అవుతోంది

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా బేబీ. రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ తో ఒక్కసారిగా అంచనాలు మారిపోయిన ఈ సినిమాకు సాయి రాజేశ్ దర్శకుడు. ఎస్కేఎన్ నిర్మాత. ఇప్పటికైతే మంచి బజ్ ఉంది. ఆ బజ్ ను మరింత పెంచేందుకు బేబీ టీమ్ కూడా ప్రస్తుత ట్రెండ్ ను ఫాలో అవుతూ.. పెయిడ్ ప్రీమియర్స్ ప్రదర్శించబోతోంది.

ఈ మధ్య కాలంలో పెయిడ్ ప్రీమియర్స్ ద్వారా తిరుగులేని విజయం సాధించిన సినిమా సామజవరగమనా. శ్రీ విష్ణు కెరీర్ లోనే బెస్ట్ హిట్ గా నిలిచిందీ సినిమా. మూవీ రిలీజ్ కు రెండు మూడు రోజుల ముందే వేసిన ప్రీమియర్స్ ద్వారా పాజిటివ్ టాక్ బాగా స్ప్రెడ్ అయింది.

అది సినిమాకు ఎంత ప్లస్ అయిందో తెలిసిందే. ఇక ఇదే తరహాలో లాస్ట్ వీక్ వచ్చిన రంగబలి టీమ్ కూడా ప్రయత్నించింది. ఈ చిత్రానికి ఫస్ట్ హాఫ్‌ కు వచ్చిన రెస్పాన్స్ చూసి బ్లాక్ బస్టర్ అనుకున్నారు. బట్ సెకండ్ హాఫ్‌ వల్ల మొత్తం పోయింది. అయినా ఈ ప్రీమియర్స్ ఆ సినిమాకు బాగా వర్కవుట్ అయ్యాయి అనే చెప్పాలి. ఇక ఇప్పుడు ఇదే తరహాలో బేబీ సినిమా టీమ్ కూడా చేయబోతోంది.


రిలీజ్ కు ఒక రోజు ముందే బేబీ మూవీ పెయిడ్ ప్రీమియర్స్ ను ప్రదర్శించబోతున్నారు. ఇప్పటికే బేబీకి అడ్వాన్స్ బుకింగ్‌స్ అర్బన్ ఏరియాల్లో స్ట్రాంగ్ గాఉన్నాయి. కొన్ని చోట్ల కొన్ని థియేటర్స్ లో మూడు రోజుల వరకూ బుకింగ్స్ అయిపోయాయి.

అదంతా ట్రైలర్ తర్వాత వచ్చిన హైప్. ఆ హైప్ ను మరింత పెంచాలంటే ఈ ప్రీమియర్స్ ఉపయోగపడతాయి. అందుకే వీళ్లు కూడా ఆ సెంటిమెంట్ ను ఫాలో అవుతూ ప్రీమియర్స్ కు ప్లాన్ చేసుకున్నారు. మరి వీళ్లు సామజవరగమనా లా సత్తా చాటతారా లేక రంగబలిలా చతికిల బడతారా అనేది చూడాలి.

Related Posts