రెండు రోజుల క్రితం మలయాళీ నటీమణి రెంజూషా మీనన్ (35) మృతి చెందింది. ఆర్థిక పరమైన కారణాలతో ఆమె తన ఫ్లాట్ లో సూసైడ్ చేసుకున్నట్టు పోలీసులు నిర్దారించారు. రెంజూషా మీనన్ మరణం మరవకముందే మలయాళీ ఇండస్ట్రీని మరో విషాదం వెంటాడింది. ఎనిమిది నెలల గర్భవతిగా ఉన్న ప్రియ (35) అనే మరో యువ నటీమణి కన్నుమూసింది. మంగళవారం రాత్రి కార్డియాక్ అరెస్ట్తో ప్రియ మృతి చెందినట్లు సహ నటుడు కిషోర్ సత్య సోషల్ మీడియాలో వెల్లడించాడు.
‘ఆమెకు ఎలాంటి అనారోగ్య సమస్యల్లేవు. రొటీన్ చెకప్ కోసం ఆస్పత్రికి వెళ్లిన ఆమె కార్డియాక్ అరెస్ట్కు గురై మృతి చెందారు. ఆమె కార్డియాక్ అరెస్ట్ కు గురవడంతో వెంటనే స్పందించిన వైద్యులు.. ఆమెకు డెలివరీ చేసి శిశువును బయటకు తీశారు.
ప్రస్తుతం ఆ నవజాత శిశువు సురక్షితంగా ఉంది. బేబీకి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. కుటుంబసభ్యుల ఆవేదన నన్నెంతో కలచివేసింది. వాళ్లను ఎలా ఓదార్చాలో కూడా నాకు అర్థం కాలేదు. మంచివాళ్లకు భగవంతుడు ఇంతటి అన్యాయం ఎందుకు చేస్తాడో..?’ అని కిషోర్ సత్య ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ పెట్టాడు.