ఏపీ వ‌ర‌ద బాధితుల‌కు ఎన్టీఆర్ రూ.25 లక్షల విరాళం

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని రాయ‌ల‌సీమ ప్రాంతంలో వ‌ర‌ద‌ల వ‌ల‌న ప్ర‌జ‌లు స‌ర్వ‌స్వం కోల్పోయి దిక్కులేక.. ఏం చేయాలో తెలియ‌క‌.. నానా క‌ష్టాలు ప‌డుతున్నారు. అయితే.. వ‌ర‌ద‌ల వ‌ల‌న క‌ష్టాల్లో ఉన్న ప్ర‌జానీకానికి నేనున్నాను అంటూ భ‌రోసా ఇచ్చేందుకు యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ రాయ‌ల‌సీమ ప్రాంతానికి వెళ్ల‌నున్నారు. ఈ విష‌యాన్ని ఎన్టీఆర్ స్వ‌యంగా ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌చేశారు. అంతే కాకుండా.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వానికి వ‌ర‌ద బాధితుల స‌హాయార్థం 25 ల‌క్ష‌లు అందిస్తున్న‌ట్టుగా తెలియ‌చేశారు.

ఇటీవ‌ల రాయ‌ల‌సీమ‌లోని కుప్పంలో తెలుగుదేశం పార్టీ నాయ‌కులు, ఎన్టీఆర్ అభిమానులు కాబోయే సీఎం ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేయ‌డం.. తెలుగుదేశం పార్టీ ప‌గ్గాలు ఎన్టీఆర్ కి అప్ప‌గించాల‌ని డిమాండ్ చేయ‌డం తెలిసిందే. ఇలాంటి ప‌రిస్థితుల్లో ఎన్టీఆర్ రాయ‌ల‌సీమ‌లో ప‌ర్య‌టించ‌నున్నాను అని ప్ర‌క‌టించ‌డం రాజ‌కీయ‌వ‌ర్గాల్లో ఆస‌క్తిగా మారింది.

Related Posts