ఆంధ్రప్రదేశ్లో సినిమా టికెట్ ధరల విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పై విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే.. సినీ ప్రముఖులు ఎవరు ఇప్పటి వరకు స్పందించలేదు కానీ.. ఈరోజు హీరో నాని సంచలన వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్ అయ్యింది. ఇంతకీ నాని ఏమన్నారంటే.. రాజకీయ నాయకులు, సినిమా వాళ్లు అనే విషయాన్ని పక్కన పెడితే ప్రేక్షకుల్ని అవమానించేలా ఈ నిర్ణయం ఉందన్నారు.
శ్యామ్సింగరాయ్ చిత్రబృందం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న నాని.. ఈ వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రభుత్వం టికెట్ ధరలు తగ్గించింది. ఏది ఏమైనా ఆ నిర్ణయం సరైనది కాదు. టికెట్ ధరలు తగ్గించి ప్రేక్షకులను అవమానించింది. థియేటర్ల కంటే పక్కన ఉన్న కిరాణా షాపుల కలెక్షన్ ఎక్కువగా ఉంది. టికెట్ ధరలు పెంచినా కొనే సామర్థ్యం ప్రేక్షకులకు ఉంది. అయితే.. నేను ఇప్పుడు ఏదీ మాట్లాడినా వివాదమే అవుతుంది అని నాని వ్యాఖ్యానించారు.
నాని ధైర్యం చేసి ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తన మనసులో మాటలను బయటపెట్టారు. మరి.. ముందు ముందు నానికి సపోర్ట్ చేస్తూ.. మరి కొంత మంది సినీ ప్రముఖులు ముందుకొస్తారేమో చూడాలి. మరి.. నాని వ్యాఖ్యల పై ఏపీ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందేమో అనేది ఆసక్తిగా మారింది.