విభిన్న కథా చిత్రాలను ఎంచుకుంటూ.. విజయాలు సాధిస్తూ.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకున్న కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్. పాత్ర ఏదైనా సరే.. ఆ పాత్రలో దూరిపోతాడు. లీనమై నటించి ఆ క్యారెక్టర్ కనిపిస్తుంది తప్పా.. ధనుష్ కనిపించలేదు అనేలా నటించడం ధనుష్ ప్రత్యేకత. అయితే.. ఎప్పటి నుంచో తెలుగులో ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నాడు. ఆఖరికి ఇప్పటికి సెట్ అయ్యింది. తెలుగులో తొలి చిత్రం యువ దర్శకుడు వెంకీ అట్లూరి డైరెక్షన్ లో చేస్తున్నాడు.
ఈ రోజు ఆ సినిమా అనౌన్సమెంట్ ని మేకర్స్ అనౌన్స్ చేశారు. ఆసక్తికర మోషన్ టీజర్ తో ఈ సినిమాకి సార్ అనే టైటిల్ ని రివీల్ చేశారు. అలాగే తమిళ్ లో కూడా ఈ చిత్రాన్ని వాతి అనే టైటిల్ తో రిలీజ్ చేస్తున్నట్టు కన్ఫర్మ్ చేసారు. అలాగే ఇందులోనే ఈ సినిమా లో కంటెంట్ కూడా ఎంత స్ట్రాంగ్ గా ఉండబోతుందో అనేది కూడా రివీల్ చేసే యత్నం చేశారు. ఈ మోషన్ పోస్టర్ డిఫరెంట్ గా ఉండి ఆసక్తి కలిగిస్తోంది.
ఇక ధనుష్ సరసన ఈ చిత్రంలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రాన్ని యువ నిర్మాత నాగవంశీ మరియు త్రివిక్రమ్ శ్రీనివాస్ భార్య సాయి సౌజన్యలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మరి.. టాలీవుడ్ ప్రేక్షకులను ధనుష్ ఎంత వరకు మెప్పిస్తాడో చూడాలి.