సెంటిమెంట్స్ కు హిట్స్ పడతాయా గోపీచంద్..?

సినిమా పరిశ్రమలో సెంటిమెంట్స్ కు ఉండే వాల్యూ కథలకు కూడా ఉండదంటే అతిశయోక్తి కాదు. ఒక సినిమా విజయంలో ఏదైనా కీలకంగా అనిపిస్తే చాలు.. ఆ విషయాన్ని పదేపదే రిపీట్ చేస్తుంటారు సినిమావాళ్లు. అలా క్రాక్ హిట్ లో పార్ట్ అయిన జయమ్మను మళ్లీ రిపీట్ చేస్తున్నాడు సదరు దర్శకుడు. దీంతో ఇది మల్టీ లింగ్వుల్ ఫిల్మ్ గా మారిపోయింది. ఇంతకీ ఇది ఎవరి సినిమా అనుకుంటున్నారా..?
2021ఆరంభంలో అప్పటి కరోనా ఫస్ట్ వేవ్ ను దాటుకుని వచ్చిన సినిమా క్రాక్. బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఒకప్పుడు ఒంగోలు ప్రాంతంలో రౌడీషీటర్ గా పేరు గాంచిన కాటారి కృష్ణ కథ చుట్టూ అల్లుకున్న ఈ కాప్ స్టోరీ కాసులు కురిపించింది. మూవీలో కటారి కృష్ణ ప్రియురాలి పాత్రలో నటించింది వరలక్ష్మి శరత్ కుమార్. ఈమె పాత్ర సినిమాలో చాలా కీలకంగా ఉంది కూడా. చాలా అగ్రెసివ్ గా కనిపించే ఆ పాత్రను అంతం చేసినప్పుడు ప్రేక్షకులు కూడా చాలా సింపతీ చూపించారు. అందుకే ఈ భామను మరోసారి రిపీట్ చేస్తున్నాడు క్రాక్ దర్శకుడు గోపీచంద్ మలినేని.
క్రాక్ విజయంతో ట్రాక్ లోకి వచ్చిన గోపీచంద్ ఇప్పుడు అన్ స్టాపబుల్ స్టార్ బాలకృష్ణతో సినిమా చేయబోతున్నాడు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ కూడా పూర్తయిన ఈ చిత్రం త్వరలోనే పట్టాలెక్కబోతోంది. ఈ చిత్రంలో ఇప్పటికే కన్నడ స్టార్ హీరో దునియా విజయ్ ని విలన్ గా తీసుకున్నాడు గోపీచంద్. ఇక మరో కీలక పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ ను రిపీట్ చేస్తున్నాడు. జయమ్మ క్యారెక్టర్ తో వరలక్ష్మికి తెలుగులో మంచి క్రేజ్ వచ్చింది. అందుకే గోపీచంద్ సినిమా అనగానే తను కూడా వెంటనే యస్ చెప్పింది. మొత్తంగా కన్నడ విలన్, తమిళ్ బ్యూటీ కీలక పాత్రలో నటిస్తోన్న ఈ చిత్రంలో మళ్లీ క్రాక్ బ్యూటీ శ్రుతి హాసన్ నే హీరోయిన్ గా తీసుకున్నాడు గోపీచంద్. మరి సెంటిమెంట్ ప్యాక్ తో రెడీ అవుతోన్న ఈమూవీ ఎలా ఉంటుందో చూడాలి.

Related Posts