రాధేశ్యామ్.. అనుకున్నంతా అయింది..?

రాధేశ్యామ్.. అనుకున్నంతా అయింది. ఇది కూడా పోస్ట్ పోన్ అయింది. వరుసగా పెరుగుతోన్న కరోనా, ఒమిక్రాన్ కేస్ ల వల్ల ఇప్పటికే పలు రాష్ట్రాలు థియేటర్స్ లో 50శాతం ప్రేక్షకులకు మాత్రమే అనుమతి అని బోర్డ్ పెట్టాయి. అటు అమెరికాలో కూడా కరోనా ఓ రేంజ్ లో విజృంభిస్తోంది. దీంతో రాధేశ్యామ్ ను వాయిదా వేయక తప్పడం లేదు అని అఫిషియల్ గా అనౌన్స్ చేసింది టీమ్. మరి మళ్లీ కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడూ అంటారా..? అది ఆ కరోనాకే తెలియాలి.
ప్రభాస్, పూజాహెగ్డే జంటగా నటించిన రాధేశ్యామ్ వాయిదా అందరూ ఊహించిందే. ఆర్ఆర్ఆర్ పోస్ట్ పోన్ అయినప్పుడే వీళ్లు కూడా అనౌన్స్ చేస్తారు అనుకున్నారు. బట్ పరిస్థితిని పూర్తిగా చూసిన తర్వాతే ప్రకటించాలనుకున్నారు. ఇప్పుడు సిట్యుయేషన్ పక్కాగా అర్థం అయింది. అందుకే వాయిదా వేయక తప్పడం లేదు అంటూ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ మూవీ కోసం ఫ్యాన్స్ చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మళ్లీ వాయిదా పడటం ఈ సారి వారికి కోపం తెప్పిస్తుందనుకోలేం. పరిస్థితి అలా ఉంది మరి.
1960ల నేపథ్యంలో యూరప్ బ్యాక్ డ్రాప్ లో పీరియాడిక్ లవ్ స్టోరీగా వస్తోన్న రాధేశ్యామ్ పై ట్రైలర్ తర్వాత అంచనాలు పెరిగాయి. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన పామిస్ట్ పాత్రలో ప్రభాస్ నటించాడు. ఇలాంటి పాత్రను ఓ పెద్ద హీరో చేయడం మన దగ్గర ఇదే మొదటి సారి అనుకోవచ్చు కూడా. తమన్ నేపథ్య సంగీతం అందించిన రాధేశ్యామ్ తో సంక్రాంతి సందడిగా ఉంటుందనుకుంది పరిశ్రమ. బట్.. వీళ్లూ వెనక్కి వెళ్లడంతో ఇక ఈ సారి సంక్రాంతికి థియేటర్స్ లో పెద్ద సందడి కనిపిస్తుందనుకోలేం.

Related Posts