సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ పాన్ ఇండియా మూవీ లైగర్. ఇందులో విజయ్ దేవరకొండ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తుంది. ఎప్పుడో ప్రేక్షకుల ముందుకు రావాల్సిన లైగర్ మూవీ కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. అయితే.. నూతన సంవత్సర కానుకగా ఈ మూవీ నుంచి రీసెంట్ గా టీజర్ రిలీజ్ చేయడం.. దీనికి ట్రెమండస్ రెస్పాన్స్ రావడం తెలిసిందే.
యూట్యూబ్ ని షేక్ చేస్తూ.. ఈ టీజర్ దూసుకెళుతుంది. ఈ టీజర్ తో లైగర్ పై అంచనాలు రెట్టింపు అయ్యాయని చెప్పచ్చు. ఈ భారీ క్రేజీ చిత్రం ఆగష్టు 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇదిలా ఉంటే.. ఈ లైగర్ కాంబినేషన్ మరోసారి సెట్ అయ్యిందని వార్తలు వస్తున్నాయి. లైగర్ అవుట్ ఫుట్ బాగా రావడం.. ముఖ్యంగా పూరి జగన్నాథ్ వర్కింగ్ స్టైల్ విజయ్ కి బాగా నచ్చడంతో పూరితో మరో సినిమా చేయాలి అనుకుంటున్నారని టాక్ వినిపిస్తోంది.
ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి ఈసారి విజయ్ తో ఎలాంటి సినిమా చేయనున్నారు అంటూ అభిమానులు ఆరా తీస్తున్నారు. అయితే.. ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించి వార్తలు వస్తున్నాయి కానీ.. అఫిషియల్ గా అనౌన్స్ చేయలేదు. ప్రచారంలో ఉన్న ఈ వార్త పై క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.