‘నా సామిరంగ‘ చిత్రంలో మరో ఇద్దరు హీరోలు?

ఆగస్టులో తన బర్త్ డే స్పెషల్ గా ‘నా సామిరంగ‘ సినిమాని అనౌన్స్ చేశాడు కింగ్ నాగార్జున. అప్పట్నుంచీ వరుస షెడ్యూల్స్ లో సినిమా షూటింగ్ కొనసాగుతూనే ఉంది. ఒకవైపు ‘బిగ్ బాస్‘లో సందడి చేస్తూనే.. మరోవైపు అస్సలు గ్యాప్ లేకుండా ఈ మూవీని జెట్ స్పీడులో కంప్లీట్ చేస్తున్నాడు కింగ్ నాగార్జున. కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ ఈ మూవీతో డైరెక్టర్ గా ఇంట్రడ్యూస్ అవుతున్నాడు. ఇప్పటివరకూ అఫీషియల్ గా చెప్పకపోయినా.. ‘నా సామిరంగ‘ మూవీ మలయాళం చిత్రం ‘పొరింజు మరియమ్ జోస్‘కి రీమేక్ అనే ప్రచారం ఉంది.

ఒరిజినల్ ‘పొరింజు మరియమ్ జోస్‘లో పొరింజు గా జోజు జార్జ్ నటిస్తే.. మరియమ్ గా నైలా ఉషా.. జోస్ పాత్రలో చెంబన్ వినోద్ కనిపించారు. ఇప్పుడు ‘నా సామిరంగ‘లో జోజ్ జార్జ్ క్యారెక్టర్ ను నాగార్జున చేస్తుంటే.. నైలా ఉషా రోల్ ని ఆషిక రంగనాథ్ పోషిస్తుంది. మరి.. మరో కీలకమైన జోస్ రోల్ ని తెలుగులో ఎవరు చేస్తారనే క్యూరియాసిటీ ఉంది. లేటెస్ట్ గా దానికి సమాధానం దొరికేసింది. ఆ పాత్రలో అల్లరి నరేష్ కనిపించబోతున్నాడట. ఇంకా.. ‘నా సామిరంగ‘లో మరో కీలక పాత్రలో రాజ్ తరుణ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో నాగార్జున, అల్లరి నరేష్, రాజ్ తరుణ్ లపై కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాడట డైరెక్టర్ విజయ్ బిన్ని. సంక్రాంతి కానుకగా ‘నా సామిరంగ‘ విడుదలకు ముస్తాబవుతోంది.

Related Posts