కరోనా కారణంగా భారీ చిత్రాల విడుదల షెడ్యూల్స్ అన్నీ మారిపోయాయి. ఇక సమ్మర్ కి అంతా సెట్ అవుతుందనే ఉద్దేశ్యంతో భారీ చిత్రాలు సమ్మర్ కి రిలీజ్ చేసేందుకు పోటీపడుతున్నాయి. ఇప్పుడు ఒకదానితో ఒకటి పోటీపడుతూ మూడు భారీ పాన్ ఇండియా చిత్రాలు ఏప్రిల్ 14న విడుదలకు రెడీ అవుతున్నాయి. ఒకే రోజున మూడు పాన్ ఇండియా సినిమాలు ఎలా రిలీజ్ చేస్తారు.? వాయిదాపడతాయి అనుకుంటే.. అలాంటిది ఏమీ లేదు.. ఖచ్చితంగా ఏప్రిల్ 14న రిలీజ్ చేస్తున్నామని మరోసారి ప్రకటించారు మేకర్స్. ఇప్పుడు అభిమానుల్లో డైలమా నెలకొంది. ఏ సినిమాని ముందుగా చూడాలన్నది ఇప్పుడు ఫ్యాన్స్ నిర్ణయించుకోలేని పరిస్థితి.
ఇంతకీ.. ఏప్రిల్ 14న రిలీజ్ కి రెడీ అవుతున్న ఆ మూడు భారీ చిత్రాలు ఏంటంటే… మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చద్దా రిలీజ్ డేట్ మారుతుందని ప్రచారం సాగినా కానీ.. యథాతథంగా ప్రకటించిన తేదీకే విడుదల చేస్తున్నామని అమీర్ ఖాన్ తాజాగా స్పష్ఠం చేశారు. ఇక రాకింగ్ స్టార్ యష్ నటించిన కేజీఎఫ్ 2 ని ఏప్రిల్ 14న విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఆ ఇద్దరితో పాటు దళపతి విజయ్ నటించిన బీస్ట్ అదే డేట్ కి అత్యంత భారీగా విడుదల కానుంది. నిజానికి కేజీఎఫ్ 2.. బీస్ట్ చిత్రాలు పలుమార్లు రిలీజ్ తేదీలను మార్చుకున్నవే.
అమీర్ ఖాన్ – చైతన్యల లాల్ సింగ్ చద్దా.. హిందీతో పాటు తెలుగులోను విడుదలయ్యే వీలుంది. అలాగే బీస్ట్ ని తమిళం – తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ విడుదల చేయనున్నారు. కేజీఎఫ్ 2 ఇటు సౌత్ అటు నార్త్ రెండు చోట్లా విడుదలవుతుంది. ఈ లెక్కన ఈ మూడు సినిమాల మధ్య గట్టి పోటీనే ఉంది. మరి.. ఈ మూడు సినిమాలు ప్రకటించినట్టుగా ఏప్రిల్ 14నే విడుదల అవుతాయా..? అదే జరిగితే… బాక్సాఫీస్ దగ్గర ఎవరు విజేతగా నిలుస్తారో చూడాలి.