‘వ్యూహం’ వచ్చిన వారానికే ‘శపథం’

ఎన్నికల దగ్గరపడుతున్న వేళ ఆయా రాజకీయ పార్టీల వ్యక్తుల కథాంశాలతో సినిమాలు రూపొందిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇప్పుడు మళ్లీ అలాంటి సినిమాలు జోరందుకున్నాయి. ముఖ్యంగా.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి కథాంశంతో మూడు వారల గ్యాప్ లోనే మూడు చిత్రాలు ఉండడం విశేషమనే చెప్పాలి. ఈ లిస్టులో ఇప్పటికే ‘యాత్ర 2’ విడుదలైంది. ఇప్పుడు కేవలం వారం రోజుల గ్యాప్ లో రెండు సినిమాలు రాబోతున్నాయి.

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏపీ రాజకీయాల్లో వేడి పుట్టించేందుకు ‘వ్యూహం, శపథం‘ చిత్రాలతో సిధ్ధమవుతున్నాడు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలతో ‘వ్యూహం, వ్యూహం 2 (శపథం)‘ రాజకీయాల్లో సెగలు పుట్టిస్తున్నాయి. వై.ఎస్.జగన్ జీవితకథతో రూపొందిన ‘వ్యూహం‘ చిత్రాన్ని ఫిబ్రవరి 23న, ‘శపథం’ చిత్రాన్ని మార్చి 1న విడుదల చేస్తున్నట్టు అనౌన్స్ చేశాడు వర్మ. ఈ సినిమాలో జగన్ గా తమిళ నటుడు అజ్మల్ అమీర్ కనిపించబోతున్నాడు. అసలు గత ఏడాదే రావాల్సిన రామ్ గోపాల్ వర్మ ‘వ్యూహం’ సిరీస్ కు కోర్టు షాకిచ్చింది. అవన్నీ దాటుకుని ఇప్పుడు విడుదలకు ముస్తాబవుతున్నాయి ఈ చిత్రాలు.

Related Posts