కరోనా కష్టకాలంలో… ఎవరికైనా కష్టం వచ్చిందంటే… నేనున్నాను అంటూ ముందుకు వచ్చిన ఆపద్భాంధవుడు సోనూసూద్. తెర పై విలన్ వేషాలు వేసినప్పటికీ… నిజ జీవితంలో మాత్రం తన దాన గుణంతో హీరో అనిపించుకున్నారు. అందరి మనసులు దోచుకున్నారు. ఎందరికో స్పూర్తిగా నిలిచారు.
ఇప్పటికీ సోనుసూద్ తన సేవా కార్యక్రమాలను కొనసాగిస్తూనే ఉన్నాడు. దీంతో సోనూసూద్కి భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది.
ఇక ఎప్పటికప్పుడు తను చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి సోషల్ మీడియాలో తెలిచేసే సోనూసూద్
కు రోజురోజుకు సోషల్ మీడియాలో ఫాలోవర్స్ విపరీతంగా పెరుగుతున్నారు. తాజాగా ఆయన ట్విట్టర్ అకౌంట్ను ఫాలో అయ్యేవారి సంఖ్య 11 మిలియన్లను దాటింది. దీంతో భారతదేశంలో ట్విట్టర్ లో అత్యధికంగా అనుసరించే ప్రముఖులలో సోనూసూద్ ఒకడిగా నిలిచాడు. వరుసగా విభిన్న పాత్రలు పోషిస్తూ ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ… సేవా కార్యక్రమాలను మాత్రం ఆపకుండా కొనసాగిస్తుండడం విశేషం.