పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమాతో వచ్చిన క్రేజ్ కి తగ్గట్టుగా వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. అసలు రెస్ట్ అనేదే లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ కెరీర్ లో దూసుకెళుతున్నారు. అలాగే పెళ్లి గురించి కూడా అసలు ఆలోచించడం లేదు. సల్మాన్ తర్వాత సీనియర్ బ్యాచలర్ అంటే ప్రభాసే అని చెప్పచ్చు. ఇదిలా ఉంటే.. ఇటీవల ఓమిక్రాన్ భయంతో షూటింగ్ లను రద్దు చేసింది.
మరి ఈ సమయంలో షూటింగ్ క్యాన్సిల్ చేస్తే.. ప్రభాస్ ఏం చేస్తున్నాడు? అంటే.. అండర్ గ్రౌండ్కి వెళ్లి తనకు అవసరమైన విశ్రాంతి తీసుకుంటున్నాడు. అలాగే ప్రస్తుతం ఆయన హిందీ చిత్రాలకు స్క్రిప్ట్ లు వింటున్నట్లు సమాచారం. గత రెండు రోజులుగా ఇద్దరు యంగ్ అప్ కమ్ హిందీ డైరెక్టర్స్ ప్రభాస్ కి స్క్రిప్ట్ లను వినిపించారని తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ వరుసగా మూడు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ప్రశాంత్ నీల్ తో సలార్, నాగ్ అశ్విన్ తో ప్రాజెక్ట్ కే, ఓంరౌత్ తో ఆదిపురుష్ చిత్రీకరణలు సాగుతున్నాయి.
ఈ సినిమాలతో పాటు అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ అనే పాన్ ఇండియా చిత్రం చేయనున్నారు. ఈ సినిమాను కూడా అఫిషియల్ గా అనౌన్స్ చేయడం జరిగింది. అయితే.. ఈ సినిమా తర్వాత ఏ డైరెక్టర్ కి ప్రభాస్ ని డైరెక్ట్ చేసే అవకాశం వస్తుంది అనేది ఆసక్తిగా మారింది. టాలీవుడ్ డైరెక్టర్స్ కూడా ప్రభాస్ తో సినిమా చేసేందుకు వెయిట్ చేస్తున్నారు. మరి.. ఈసారి ప్రభాస్ టాలీవుడ్ డైరెక్టర్ కి ఛాన్స్ ఇస్తాడో.. బాలీవుడ్ డైరెక్టర్ కి ఛాన్స్ ఇస్తాడో చూడాలి.