పాపం… పూరి. జ‌న‌గ‌ణ‌మ‌న మ‌ళ్లీ ఆగిందా..?

డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ డ్రీమ్ ప్రాజెక్ట్ జ‌న‌గ‌ణ‌మ‌న‌. ఈ క‌థ‌ను తెర పై చూసుకోవాల‌ని.. అంద‌రికీ చూపించాల‌ని ఎప్ప‌టి నుంచో త‌పిస్తున్నారు కానీ.. అనుకున్న‌ట్టుగా జ‌ర‌గ‌డం లేదు. సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబుతో ఈ సినిమా చేయాలి అనుకున్నారు. మ‌హేష్ కి క‌థ చెప్ప‌డం… క‌థ విని మ‌హేష్ ఓకే చెప్ప‌డం జ‌రిగింది కానీ.. కొన్ని కార‌ణాల వ‌ల‌న ఈ ప్రాజెక్ట్ ముందుకు వెళ్ల‌లేదు. ఆత‌ర్వాత ఈ క‌థ‌ను పూరి.. వెంక‌టేష్ కి చెప్ప‌డం జ‌రిగింది. వెంక‌టేష్ కూడా న‌చ్చింది చేద్దామ‌న్నారు కానీ… ఈ సినిమాకి భారీ బ‌డ్జెట్ అవుతుంది.

వెంకీతో అంత బ‌డ్జెట్ వ‌ర్క‌వుట్ కాద‌నే ఉద్దేశ్యంతో ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది. త‌ర్వాత కేజీఎఫ్ హీరో య‌శ్ తో ఈ సినిమా చేయాలి అనుకున్నారు కానీ.. అక్క‌డా వ‌ర్క‌వుట్ కాలేదు. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ పేరు కూడా బాగా వినిపించింది. ప‌వ‌న్, పూరి కాంబినేష‌న్లో జ‌న‌గ‌ణ‌మ‌న దాదాపు క‌న్ ఫ‌ర్మ్ అనుకున్నారు. ఇక్క‌డ కూడా అంతే.. మాట‌ల‌కే ప‌రిమితం అయ్యింది కానీ… ముందుకు వెళ్ల‌లేదు. ఇలా.. పూరి డ్రీమ్ ప్రాజెక్ట్ డిస్క‌ష‌న్స్ కే ప‌రిమితం అవుతుంది కానీ.. సెట్స్ పైకి వెళ్ల‌డం లేదు. ఇలాంటి టైమ్ లో సెన్సేష‌న‌ల్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో పూరి ఈ సినిమా చేయాలి అనుకున్నారు.

విజ‌య్ తో చేస్తున్న లైగ‌ర్ పూర్తైన వెంట‌నే జ‌న‌గ‌ణ‌మ‌న సెట్స్ పైకి తీసుకెళ్లాలి అనుకున్నారు. ఫిబ్ర‌వ‌రి నుంచే షూటింగ్ స్టార్ట్ చేయాలి అనుకున్నారు. అయితే.. ఈ సినిమాకు లోకషన్ల వేట ఆలస్యం అవుతోందట‌. అందుకని ఈ లోగా మ‌రో సినిమా చేసేయాలని విజ‌య్ డిసైడ్ అయ్యాడట‌. శివ నిర్వాణ డైరెక్ష‌న్ లో విజ‌య్ ఓ సినిమా చేసేందుకు ఎప్పుడో ఓకే చెప్పాడు. ఇప్పుడు ఈ సినిమాని స్టార్ట్ చేయ‌నున్న‌ట్టు స‌మాచారం. ఇది పూర్తైన త‌ర్వాత జ‌న‌గ‌ణ‌మ‌న సెట్స్ పైకి వ‌స్తుంద‌ట‌. పూరి.. ఏ ముహుర్తాన జ‌న‌గ‌ణ‌మ‌న క‌థ రాసుకున్నాడో కానీ… ముందుకు వెళ్ల‌డం లేదు. తాజాగా ఆగ‌ష్టు లేదా సెప్టెంబ‌ర్ నుంచి జ‌న‌గ‌ణ‌మ‌న సెట్స్ పైకి తీసుకెళ్లాలి అనుకంటున్నార‌ట‌. మ‌రి… ఈసారైనా ఎలాంటి అడ్డంకులు రాకుండా జ‌న‌గ‌ణ‌మ‌న‌ స్టార్ట్ అవుతుందేమో చూడాలి.

Related Posts