ప్రభాస్‌కి మినిమమ్ 30 – 40 ఉండాల్సిందే!

ఇండస్ట్రీలో ఎప్పుడూ వార్తల్లో ఉండే టాపిక్స్‌లో ప్రభాస్‌ ఆతిథ్యం ఒకటి. బాహుబలి పార్టీ ఇస్తే ఏ రేంజ్‌లో ఉంటుంది? ఆయనకు నచ్చిన వాళ్లకు ఎన్ని రకాలు డిషెస్‌ సర్వ్ చేస్తారు? అనే విషయాలు ఎప్పుడూ ఇంట్రస్టింగ్‌గానే ఉంటాయి. దానికి తోడు ప్రభాస్‌ ఇవాళ మాకు లంచ్‌ తెప్పించాడనో, ఇంటి నుంచి భోజనం తెచ్చిపెట్టాడనో అప్పుడప్పుడూ సెలబ్రిటీలు మాట్లాడుకుంటూ ఉంటారు. నార్త్ వాళ్లయితే ప్రభాస్‌ ఆతిథ్యానికి ఫిదా అయిపోయారు. ఆయనతో పనిచేసిన ప్రతి హీరోయిన్‌ తమ ఇన్‌స్టా స్టోరీల్లో బాహుబలి డిషెస్‌ వెరైటీస్‌ని పిక్స్ తీసిపెట్టేవారు.

లేటెస్ట్‌గా అఖిల్‌, అమల అక్కినేని, శర్వానంద్‌ కూడా ప్రభాస్‌ భోజన ప్రియత్వం గురించి సరదాగా మాట్లాడుకున్నారు. ప్రభాస్‌ ఫుడీ అని విన్నాను అని అమల అంటే, వెంటనే అఖిల్‌, శర్వానంద్‌ అందుకుని అవును అనేశారు. అంతే కాదు, మా అమ్మ ప్రభాస్‌కి దొరికితే అంతే. అతను వడ్డించే భోజనం తినలేకపోతుందని అఖిల్‌ అన్నారు. ఏకంగా 30, 40 వెరైటీలు లేకపోతే ప్రభాస్‌కి భోజనం చేసినట్టు ఉండదని అన్నారు శర్వానంద్‌.

శర్వానంద్‌, అమల నటించిన ఒకే ఒక జీవితం సినిమా ప్రమోషన్లో భాగంగా ఈ కాన్వర్జేషన్‌ చోటుచేసుకుంది. ఈ కాన్వర్జేషన్‌ని బట్టి అఖిల్‌కీ, ప్రభాస్‌కీ మంచి ర్యాపో ఉందన్న విషయం తెలిసింది. శర్వానంద్‌కి ప్రభాస్‌కీ ఎటూ మంచి ర్యాపో ఉంది. శర్వానంద్‌ చాలా మంచి కుక్‌. చాలా రోజులుగా సరైన్‌ హిట్‌ కోసం వెయిట్‌ చేస్తున్నారు శర్వానంద్‌. ఇప్పుడు ఒకే ఒక జీవితం ఆ హిట్‌ ఇస్తుందనే ఆశతో ఉన్నారు. చాన్నాళ్ల తర్వాత ఆయన నటించిన సినిమా తమిళంలో విడుదలవుతోంది.

Related Posts