ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల వరదలు రావడం.. ప్రజలకు, ప్రభుత్వానికి భారీగా నష్టం కలగడం తెలిసిందే. ఎప్పుడు వరదలు వచ్చినా ప్రజలు కష్టాల్లో ఉన్నారని తెలిసినా టాలీవుడ్ స్టార్ లు ముందుకు రావడం చేతనైనంత సాయం చేయడం జరుగుతుంటుంది. టాలీవుడ్ స్టార్ హీరోలు స్పందించి ఒక్కొక్కరు 25 లక్షల చొప్పున సాయం అందించారు. అయితే.. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తన ఉన్నతమైన మనసు చాటుకొని భారీ సాయం అందించారు. సాయం చేయడంలో ప్రభాస్ చేయి ఎప్పుడూ పెద్దగానే ఉంటుంది. ఏ కష్టం వచ్చినా కూడా తాను ఉన్నానంటూ ముందుకొస్తుంటారు ప్రభాస్.
గతంలో ఎన్నోసార్లు సాయం చేసారు ప్రభాస్. తాజాగా మరోసారి ఇదే చేసారు. ఆంధ్రప్రదేశ్లో వరదలు కారణంగా కోట్లాది రూపాయలు నష్టపోయారు ప్రజలు, ప్రభుత్వం. వాళ్లను ఆదుకోడానికి ఏపీ గవర్నమెంట్ కూడా తమదైన సాయం చేస్తుంది. ప్రభాస్ ఏకంగా కోటి రూపాయలు విరాళం అందిస్తున్నట్లు ప్రకటించారు. గతంలో కూడా ఈయన భారీగానే విరాళాలు అందచేసారు. హైదరాబాద్ వరదల సమయంలో కూడా కోటి రూపాయలు అందించారు ప్రభాస్.
ఇక కరోనా సమయంలో ఏకంగా 4.5 కోట్ల విరాళం అందించారు. ఇలా అవసరం అనుకున్న ప్రతీసారి ప్రభాస్ తన గొప్ప మనసు చాటుకుంటూనే ఉన్నారు. తాజాగా మరోసారి కోటి రూపాయలు విరాళం ఇచ్చారు యంగ్ రెబల్ స్టార్. ఈయన పెద్ద మనసుకు అభిమానులతో పాటు అంతా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.