చిరంజీవితో బోయ‌పాటి మూవీ. మెగా ఫ్యాన్స్ కి పండ‌గే

ఊర మాస్ డైరెక్ట‌ర్ అంటే ఠ‌క్కున గుర్తుకువ‌చ్చే పేరు బోయ‌పాటి శ్రీను. భ‌ద్ర సినిమాతో ద‌ర్శ‌కుడిగా ఎంట్రీ ఇచ్చిన బోయ‌పాటి శ్రీను తొలి సినిమాతోనే త‌న మార్క్ చూపించాడు. క‌మ‌ర్షియ‌ల్ గా బిగ్ స‌క్సస్ సాధించాడు. అప్ప‌టి నుంచి వెనుదిరిగి చూడ‌కుండా అన్ స్టాప‌బుల్ అన్న‌ట్టుగా దూసుకెళుతున్నాడు. చ‌ర‌ణ్ తో తెర‌కెక్కించిన‌ విన‌య విధేయ రామ ప్లాప్ అవ్వ‌డంతో కాస్త వెన‌క‌బ‌డ్డాడు అనిపించినా అఖండ‌తో మ‌ళ్లీ ఫామ్ లోకి వ‌చ్చేశాడు బోయ‌పాటి. దీంతో బోయ‌పాటికి మ‌ళ్లీ డిమాండ్ పెరిగింది. వ‌రుస‌గా క్రేజీ ఆఫ‌ర్స్ అందిపుచ్చుకుంటున్నారు.

అఖండ అద్భుత‌మైన విజ‌యం సాధించ‌డంతో మెగాస్టార్ చిరంజీవి బోయ‌పాటికి ఫోన్ చేసి అభినందించార‌ట‌. అఖండ చాలా బాగుంద‌ని మెచ్చుకోవ‌డ‌మే కాకుండా.. మంచి క‌థ‌తో వ‌స్తే.. సినిమా చేద్దామ‌ని ఆఫ‌ర్ ఇచ్చార‌ట‌. చిరు, బోయ‌పాటి కాంబినేష‌న్లో మూవీని మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ నిర్మించాలి అనుకున్నారు. గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్ లో ఈ సినిమా ఉంటుంద‌ని స‌రైనోడు సినిమా టైమ్ లో వార్త‌లు వ‌చ్చాయి. అయితే.. ఆత‌ర్వాత బోయ‌పాటి రామ్ చ‌ర‌ణ్ తో విన‌య విధేయ రామ సినిమా చేయ‌డం.. ఆ సినిమా ఫ్లాప్ అవ్వ‌డంతో చిరు ప్రాజెక్ట్ ప‌క్క‌కు వెళ్ళింది.

ఇప్పుడు అఖండ అద్భుత‌మైన విజ‌యం సాధించ‌డంతో చిరు నుంచి బోయ‌పాటికి ఆఫ‌ర్ వ‌చ్చింది. అఖండ త‌ర్వాత బోయ‌పాటి బ‌న్నీతో సినిమా చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. అల్లు అర‌వింద్.. బ‌న్నీ, బోయ‌పాటి కాంబినేష‌న్లో మూవీని ఇటీవ‌ల అఫిషియ‌ల్ గా అనౌన్స్ చేయ‌డం జ‌రిగింది. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుగుతుంది. త్వ‌ర‌లో ఈ భారీ చిత్రం సెట్స్ పైకి వెళ్లేందుకు రెడీ అవుతుంది. అయితే.. బోయ‌పాటి క‌నుక క‌థ‌తో చిరును మెప్పిస్తే.. క్రేజీ ప్రాజెక్ట్ సెట్ అవ్వ‌డం ఖాయం. అదే క‌నుక జ‌రిగితే మెగా అభిమానుల‌కు పండ‌గే.

Related Posts