పవన్ కళ్యాన్ క్లారిటీ ఇచ్చాడు.. ఓ పనైపోయింది..

కెరీర్ లో ఎప్పుడూ లేని విధంగా గతేడాది వరుసగా మూడు నాలుగు సినిమాలు ప్రకటించాడు పవన్ కళ్యాణ్‌. ఇవన్నీ 2024 ఎన్నికలకు ముందు వరకూ పూర్తి చేసి అవి ఇచ్చే బూస్ట్ తో ఎలక్షన్స్ లోనూ గెయిన్ కావొచ్చు అనుకున్నాడు. బట్.. ముందు ఒప్పుకున్న సినిమాలు పక్కన బెట్టి వెనక ఒప్పుకున్న వకీల్ సాబ్, భీమ్లా నాయక్ చిత్రాలు పూర్తి చేశాడు.

క్రిష్‌ డైరెక్షన్ లో మొదలైన హరిహరవీరమల్లు విషయంలో మాత్రం పవన్ కళ్యాణ్‌ నిర్మాతను నానా ఇబ్బందులకూ గురి చేస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ కోసం వేసిన సెట్స్ వర్షాకాలంలో తడిసిపోయి షూటింగ్ కు పనిచేయనంతంగా పాడయిపోయాయి. ఒక్కోసారి కాల్షీట్స్ ఇచ్చిన తర్వాత సడెన గా ఏదైనా పొలిటికల్ అవసరం వస్తే వెంటనే అక్కడికి వెళ్లిపోతున్నాడు పవన్. దీని వల్ల నిర్మాతకు మరింత లాస్ అవుతోంది. ఇన్ని దాటుకుని చివరికి ఎలాగోలా హరిహరవీరమల్లును చివరి దశకు తెచ్చాడు దర్శకుడు.


మరోవైపు ఈ మూవీతో పాటు కమిట్ అయిన హరీశ్ శంకర్ సినిమా భవదీయుడు భగత్ సింగ్ గురించి ఏ అప్డేట్ లేదు. అలాగే మధ్యలో ఓ తమిళ్ సినిమాను రీమేక్ చేయాలని ప్రయత్నించారు. అదీ ఆగిపోయింది. చివరగా సురేందర్ రెడ్డితో సినిమా అనౌన్స్ అయింది. అదీ అటకెక్కినట్టే. ఏది ఎప్పుడు మొదలుపెడతాడు అనే క్లారిటీ అస్సలు కనిపించడం లేదు. ఈ క్రమంలో ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ చెక్ పెట్టే నిర్ణయం తీసుకున్నాడు పవన్ కళ్యాణ్‌.


ప్రస్తుతం చివరి దశలో ఉన్న హరిహర వీరమల్లును మాత్రం పూర్తి చేసి మిగతా సినిమాలను ఎన్నికల తర్వాత చేయాలని నిర్ణయించుకున్నాడ. ఆ మేరకు హరీశ్ శంకర్ కు కూడా ఇన్ఫర్మేషన్ వెళ్లిందట. అందుకే అతను వేరే హీరోలను ప్రయత్నిస్తున్నాడు. అటు ప్రొడ్యూసర్స్ కూడా ఆల్టర్నేషన్స్ చూసుకుంటున్నాడు. సో.. మొత్తంగా పవన్ ఇచ్చిన క్లారిటీతో ఓ పెద్ద గందరగోళానికి తెర పడినట్టైంది. సో.. ఇక ఎన్నికల తర్వాత యాక్షన్ కట్ మధ్యలోకి వస్తాడన్నమాట.

Related Posts