సర్కారువారి పాట అదిరిపోయే అప్డేట్

సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటిస్తోన్న సినిమా సర్కారు వారి పాట. మే 12న విడుదల కాబోతోన్న ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే ప్రమోషన్స్ స్టార్ట్ చేయాల్సి ఉంది. కానీ ఆచార్య సినిమా హడావిడీ కోసం ఆపారు. అయినా ఫ్యాన్స్ తో పాటు ఈ చిత్రం కోసం ఎదురుచూస్తోన్న అభిమానులందరికీ అద్దిరిపోయే అప్డేట్ ఇచ్చింది మూవీ టీమ్. సర్కారు వారి పాట ట్రైలర్ ను మే 2న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. ఆ రోజు ఏ టైమ్ కు విడుదల చేస్తారు అనేది చెప్పలేదు కానీ.. డేట్ అయితే వచ్చేసింది కదా..

ఇక పరశురామ్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రానికి సంబంధించిన వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఆ మధ్య పోస్ట్ పోన్ అవుతుంది అంటూ కొన్ని రూమర్స్ కూడా వినిపించాయి. వాటిని అప్పుడే మూవీ మేకర్స్ కొట్టిపడేశారు. అయినా ఆగలేదు. కానీ ఇప్పుడు ట్రైలర్ డేట్ తో ఇక ఆ రూమర్స్ కు ఫుల్ స్టాప్ పడుతుందని చెప్పొచ్చు. ఇప్పటికే వచ్చిన సర్కారు వారి పాట టీజర్ చూసిన తర్వాత ఫ్యాన్స్ అంతా మరో పోకిరిని చూడబోతున్నామా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటు మహేష్ సరసన కీర్తి సురేష్ ఫస్ట్ టైమ్ నటించిన సినిమా కావడంతో కాంబినేషన్ కూడా కొత్తగా ఉంటుంది. ఆ కొత్తదనం ఎంత ఆకట్టుకుంటుంది అనేది కళావతి సాంగ్ కు యూ ట్యూబ్ లో వచ్చిన 150 మిలియన్ వ్యూస్ ఓ సాక్ష్యం.
తమన్ నేపథ్యం సంగీతం సినిమా కూడా సర్కారు వారి పాట సత్తాను డబుల్ చేస్తుందంటున్నారు. టైటిల్ సాంగ్ కాస్త యావరే అనిపించినా.. విజువల్ గా బావుంటుందేమో చూడాలి. మొత్తంగా మే 2న ట్రైలర్ తో సర్కారు వారి పాటలో సత్తా ఏ రేంజ్ లో ఉండబోతోందని అనేది మాత్రం తెలుస్తుంది.

Related Posts