లేడీ విలన్ కావాలంటున్న మాస్ హీరో

లేడీ విలన్ సెంటిమెంట్ ను బాగా ఫాలో అవుతున్నారు మాస్ హీరో రవితేజ. ఇటీవల క్రాక్ సినిమాలో వరలక్ష్మి చేసిన జయమ్మ క్యారెక్టర్ బాగా క్లిక్ అయిన కారణంగా మళ్లీ తన కొత్త సినిమాలో లేడీ విలన్ కోసం సెర్చింగ్ స్టార్ట్ చేశారు. గతంల కిక్ చిత్రంలో రవితేజ నళినీ అనే సీనియర్ హీరోయిన్ తో కాసేపు సీరియస్ గా డిస్కషన్స్ చేస్తుంటారు. వీళ్ల ఫేస్ టు ఫేస్ ఎపిసోడ్స్ ఆ సినిమాలో బాగా పేలాయి. లేడీ విలన్ లతో హీరోలు తలపడటం ఓ ట్రెండ్ గానూ మారుతోంది.

క్రాక్ సినిమాలో మెయిన్ విలన్ కటారి కృష్ణ కంటే జయమ్మ క్యారెక్టర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. మాస్ కూడా జయమ్మ క్యారెక్టర్ ను బాగా ఇష్టపడ్డారు. అంత కరోనా వేవ్ లోనూ క్రాక్ సినిమా రికార్డ్ వసూళ్లు తెచ్చిందంటే కారణం ఈ మాస్ ఎలిమెంట్సే. క్రాక్ సక్సెస్ ఊపులో ఒకేసారి నాలుగైదు చిత్రాలకు ఓకే చెప్పేశారు రవితేజ. అందులో రావణాసుర అనే సినిమా ఇటీవల మెగాస్టార్ చిరంజీవి అతిథిగా గ్రాండ్ గా ప్రారంభోత్సవం జరుపుకుంది. ఈ సినిమాను దర్శకుడు సుధీర్ వర్మ తెరకెక్కిస్తున్నారు.

ఈ రావణాసుర సినిమా లో లేడీ విలన్ కు మంచి స్పేస్ ఉందట. దాంతో ఆ క్యారెక్టర్ కోసం పలువురు యంగ్ యాక్ట్రెస్ పేర్లను పరిశీలిస్తున్నారు. ఈ లిస్టులో దక్ష నగార్కర్, అనూ ఇమ్మాన్యుయేల్ వంటి నాయికలను కన్సిడర్ చేశారు. చివరగా ఈ సెర్చింగ్ పూజిత పొన్నాడ దగ్గర ఆగినట్లు తెలుస్తోంది. దర్శకుడు, సెవెన్, వేర్ ఈజ్ వెంకటలక్ష్మి, రంగస్థలం లాంటి చిత్రాలతో పేరు తెచ్చుకుంది పూజిత. అయితే ఆమె అందానికి తగిన గుర్తింపు, సరిపోయే పాత్ర దొరకలేదు. రావణాసురతో ఈ తెలుగు భామకు ఆ కొరత తీరే అవకాశముంది.

Related Posts