ఎన్టీఆర్ మూవీలో కూడా జాహ్న‌వినే

అతిలోక సుంద‌రి శ్రీదేవి ముద్దుల కుమార్తె జాహ్నవి టాలీవుడ్ ఎంట్రీ గురించి గ‌త కొంతకాలంగా వార్త‌లు వ‌స్తూనే ఉన్నాయి. అయితే… ఇప్పుడు ఈ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీకి అంతా ఫిక్స్ అయ్యింద‌ని స‌మాచారం. డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ డైరెక్ష‌న్ లో రూపొందే మూవీలో జాహ్న‌వి న‌టించ‌నుంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించే ఈ చిత్రాన్ని బాలీవుడ్ ఫిల్మ్ మేక‌ర్ క‌ర‌ణ్ జోహార్ నిర్మించ‌నున్నారు.

తాజా వార్త ఏంటంటే… జాహ్న‌వి ఎన్టీఆర్ స‌ర‌స‌న కూడా న‌టించేందుకు ఓకే చెప్పింద‌ని స‌మాచారం. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌ మైత్రీ మూవీస్ ఎన్టీఆర్ తో ఓ భారీ చిత్రాన్ని నిర్మించేందుకు ప్లాన్ చేస్తుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ స‌ర‌స‌న న‌టించేందుకు జాహ్న‌విని తీసుకున్నార‌ని టాలీవుడ్ లో గ‌ట్టిగా వినిపిస్తోంది. ఇంత‌కీ ఈ క్రేజీ, భారీ చిత్రానికి ద‌ర్శ‌కుడు ఎవ‌రంటే… టాలీవుడ్ లోకి ఉప్పెనలా దూసుకువచ్చిన యువ‌ దర్శకుడు బుచ్చిబాబు. ఈ యంగ్ డైరెక్ట‌ర్ ఓ కథను ఎన్టీఆర్ తో ఓకే చేయించుకున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకు జాన్వీ పెర్ పెక్ట్ ఫిట్ అని యూనిట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనివల్ల సినిమాకు పాన్ ఇండియా లుక్ కూడా వస్తుంది. ఈ ఏడాది చివరకు ఈ సినిమా సెట్ మీదకు వెళ్లే అవకాశం వుంది. త్వ‌ర‌లోనే ఈ సినిమాను అధికారికంగా ప్ర‌క‌టిస్తార‌ని స‌మాచారం. నాడు సీనియ‌ర్ ఎన్టీఆర్ స‌ర‌స‌న శ్రీదేవి న‌టించింది. ఇప్పుడు జూనీయ‌ర్ ఎన్టీఆర్ స‌ర‌స‌న జాహ్న‌వి న‌టిస్తే.. ఆ సినిమాకి మ‌రింత క్రేజ్ రావ‌డం ఖాయం.

Related Posts