పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ రిలీజ్ కి రెడీగా ఉంది. ఈ సినిమాతో పాటు పవర్ స్టార్ హరి హర వీరమల్లు అనే భారీ పిరియాడిక్ మూవీలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి విభిన్న కథా చిత్రాల దర్శకుడు క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. దాదాపుగా 120 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమా రూపొందుతోంది. ఇది పవన్ కళ్యాణ్ కి ఫస్ట్ పాన్ ఇండియా మూవీ. ఎప్పుడో ప్రేక్షకుల ముందుకు రావాలి కానీ.. కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది.
ఇందులో పవర్ స్టార్ సరసన ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ నటిస్తుంది. అయితే లేటెస్ట్ గా సోషల్ మీడియాలో నిధి అగర్వాల్ పవన్ కళ్యాణ్ పై కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేయడం వరైర్ అయ్యాయి. ఇంతకీ ఈ అమ్మడు పవర్ స్టార్ గురించి ఏమన్నదంటే.. పవర్ స్టార్ మోస్ట్ ఫేవరేట్. ఆయన టెర్రిఫిక్ ఫెర్ ఫార్మర్. పవన్ సర్ దేవుని ఆశీస్సులతో కలిగిన ఒక వన్ మ్యాన్ ఆర్మీ లాంటి వారని తెలిపింది. దీనితో ఇపుడు ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తాజా అప్ డేట్ ఏంటంటే.. ఇప్పటి వరకు దాదాపు యాభై శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. జనవరి నుంచి తాజా షెడ్యూల్ స్టార్ట్ చేయనున్నారు. ఈ మూవీని ఏప్రిల్ లో రిలీజ్ చేయాలనుకున్నారు కానీ.. ప్రస్తుత పరిస్థితుల వలన మరింత ఆలస్యం అయ్యే ఛాన్స్ ఉంది.