భార్యాభర్తలుగా విడిపోయిన ధనుష్ ఐశ్వర్య

కోలీవుడ్ హీరో ధనుష్ ఐశ్వర్య దంపతులు విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. తమ 18 ఏళ్ల వైవాహిక బంధానికి వీడ్కోలు పలికారు. 2004 లో ధనుష్ ఐశ్వర్య వివాహం చేసుకున్నారు. వీళ్లకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. కొంత కాలంగా ధనుష్, ఐశ్వర్య దూరంగా ఉంటున్నారు. తాజగాా ఒకరికొకరు వేరు కావాలనే నిర్ణయాన్ని ప్రకటించారు.

సోషల్ మీడియా ద్వారా ధనుష్ ఐశ్వర్య తమ విడాకుల విషయాన్ని ప్రకటించారు. స్నేహితులుగా, భార్యా భర్తలుగా, తల్లిదండ్రులుగా ఇన్నేళ్లు కలిసి ఉన్నాం. మమ్మల్ని మేము బాగా అర్థం చేసుకునేందుకు వ్యక్తిగతంగా సమయం కావాలని అనిపించింది. అందుకే భార్యా భర్తలుగా విడిపోతున్నాం. మా నిర్ణయాన్ని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాం. మేమీ పరిస్థితిని ఎదుర్కొనేందుకు ప్రైవసీ కావాలి. అని తమ పోస్టులో పేర్కొన్నారు. ఐశ్వర్య కూడా ఇదే పోస్టు ద్వారా తమ విడాకుల విషయాన్ని ప్రకటించారు.

అప్పటికి వర్ధమాన కథానాయకుడిగా ఉన్న ధనుష్ సూపర్ స్టార్ రజినీ కూతురు ఐశ్వర్యను పెళ్లి చేసుకోవడం తమిళ చిత్ర పరిశ్రమలో సంచలనం కలిగించింది. తన కూతురు ప్రేమను అంగీకరించిన రజినీ ధనుష్ తో ఐశ్వర్య వివాహాన్ని ఘనంగా జరిపించారు. కొన్నేళ్లకు ధనుష్ స్టార్ గా ఎదిగారు. రజినీకాంత్ కాలా చిత్రాన్ని తన వండర్ బార్ ఫిలింస్ బ్యానర్ పై ధనుష్ నిర్మించారు. ఇలా ప్రొఫెషనల్ గా ధనుష్ రజినీ కుటుంబం చాలా కలిసి మెలిసే ఉన్నారు. ధనుష్ ఐశ్వర్య విడాకుల ప్రకటన అటు పరిశ్రమనూ అవాక్కయ్యేలా చేసింది.

Related Posts