బండ్ల గణేష్.. ఎప్పుడు తన మాటలతో.. సోషల్ మీడియాలో పెట్టే పోస్టులతో వార్తల్లో ఉంటుంటారు. ఆయనకు కరోనా ఫస్ట్ వేవ్ టైమ్ లో కరోనా వచ్చింది. తర్వాత సెకండ్ వేవ్ లోను వచ్చింది. ఇప్పుడు థర్డ్ వేవ్ లోను ఆయనకు కరోనా వచ్చింది. ఈవిధంగా మూడు సార్లు కరోనా వచ్చిన సెలబ్రిటీగా బండ్ల గణేష్ ఓ రికార్డ్ క్రియేట్ చేశారని చెప్పచ్చు. తాను తాజాగా మరోసారి కరోనా బారిన పడిన విషయాన్ని ఆయన తన సోషల్ మీడియా ఖాతా ద్వారా తెలియచేశారు.
ఇప్పటికే రెండుసార్లు దాని బారిన పడిన బండ్ల గణేష్.. మూడోసారి కరోనా కాటుకు గురి కావటం నిజంగా షాకింగే. ఫస్ట్ టైమ్ కరోనా వచ్చినప్పుడు ఆయన బాగానే బయటపడ్డారు కానీ.. ఆతర్వాత సెకండ్ టైమ్ కరోనా వచ్చినప్పుడు మాత్రం హాస్పటల్ లో జాయిన్ కావాల్సివచ్చింది. ఆతర్వాత నుంచి బండ్ల గణేష్ లో చాలా మార్పు వచ్చింది. జీవితంలో.. చాలా నేర్చుకున్నాను అని అప్పట్లో చెప్పారు. చాలా జాగ్రత్తగా ఉండాలని అందరికీ చెప్పారు.
మరేం జరిగిందో కానీ మూడోసారి ఆయన కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న ఆయన.. తాను కరోనా పాజిటివ్ అని తేలిందని..ఆదివారం సాయంత్రం పరీక్ష చేయించుకోగా.. మూడోసారి కరోనా బారిన పడినట్లుగా తేలిందన్నారు. లక్షణాలు స్వల్పంగానే ఉన్నాయి. నా కుటుంబ సభ్యులందరికి నెగిటివ్ వచ్చింది. దయచేసి అందరూ జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాలు చేయాలనుకునేవారు ఒకసారి ఆలోచించుకోండి. ప్రస్తుతం ఐసోలేషన్ లో ఉన్నాను అని చెప్పారు. ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ లతో పోలిస్తే.. థర్డ్ వేవ్ లో టాలీవుడ్ కు చెందిన ప్రముఖులు కరోనా బారినపడ్డారు.