అల్లు అర్జున్ ఆగమైండు.. నితిన్ ఏమైతడో ..

రచయితలు దర్శకులు కావడం అనే ట్రెండ్ తెలుగులో ఎప్పటి నుంచో ఉంది. అయితే ఈ ట్రెండో సూపర్ సక్సెస్ అనిపించుకున్నవాళ్లు తక్కువ అనే చెప్పాలి. కొన్నాళ్లుగా రైటర్స్ డైరెక్టర్స్ గా ఎక్కువగా మారుతున్నారు. ఆ మార్పులో నుంచే దర్శకుడయ్యాడు వక్కంతం వంశీ. రచయితగా వైవిధ్యమైన సినిమాలకు కథలు అందించిన వంశీ దర్శకుడుగా మారి ఆ వైవిధ్యాన్ని చూపించలేకపోయాడు. ఏకంగా అల్లు అర్జున్ వంటి స్టార్ ఇచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోలేకపోయాడు. వంశీ దర్శకుడుగా రూపొందించిన తొలి సినిమా నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా బాక్సాఫీస్ వద్ద దారుణమైన రిజల్ట్ చూసింది. డిజాస్టర్ అనిపించుకున్న ఈ మూవీ విషయంలో తప్పంతా వంశీదే అన్నట్టుగా కమెంట్స్ వచ్చాయి. ఏ మాత్రం పసలేని పాత్రలతో రూపొందించిన కథనం వల్లే సినిమా పోయిందన్నారు. దీంతో ఫస్ట్ మూవీ తర్వాత తనకు బోలెడు అవకాశాలు వస్తాయని భావించిన వంశీకి షాక్ తప్పలేదు. ఆ కారణంగానే మరో సినిమా రావడానికి ఇన్నేళ్లు పట్టింది.
ప్రస్తుతం వరుస ఫ్లాపుల్లో ఉన్న నితిన్ తో సినిమా వంశీ సినిమా మొదలైంది. ఈ కాంబినేషన్ గురించి చాలా రోజులుగా వినిపిస్తోంది. లేటెస్ట్ గా ఓపెనింగ్ కూడా జరుపుకుందీ చిత్రం. ప్రస్తుతం మాచర్ల నియోజకవర్గం అనే సినిమా చేస్తోన్న నితిన్ ఈ చిత్రాన్ని కూడా తన సొంత బ్యానర లోనే నిర్మించుకుంటున్నాడు.
నితిన్ సరసన లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. తమిళ్ లో చాలాకాలం క్రితమే వెనకబడిపోయిన హారిస్ జయరాజ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండటం విశేషం. మొత్తంగా వంశీని నమ్మిన అల్లు అర్జున్ దారుణమైన ఫ్లాప్ చూశాడు. మరి ఇప్పటి వరకూ ఏ స్టార్ హీరో కూడా వంశీకి ఛాన్స్ ఇవ్వలేదు. అయినా నితిన్ నమ్మాడు. మరి ఈ సారైనా ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాడా లేక నితిన్ కు కూడా అల్లు అర్జున్ లాంటి రిజల్ట్ ఇస్తాడా అనేది చూడాలి.
ఇక నితిన్ ఇప్పుడు చేస్తోన్న మాచర్ల సినిమా అయిపోయిన తర్వాతే ఈ మూవీ చిత్రీకరణ మొదలవుతుందట.

Related Posts