మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల క్రేజీ కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ క్రేజీ మూవీ ఆచార్య. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఆచార్య ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. ఆచార్య చిత్రం ఎప్పుడో రిలీజ్ కావాలి కానీ.. కరోనా కారణంగా వాయిదా పడింది. ఎట్టకేలకు అన్ని అడ్డంకులను దాటుకుని ఫిబ్రవరి 4న ఆచార్య చిత్రాన్ని
విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు. రీసెంట్ గా సానా కష్టం.. అనే పాట రిలీజ్ చేశారు.
ఇక సంక్రాంతికి ఆచార్య ట్రైలర్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే.. ఇప్పుడు ఆచార్య మరోసారి వాయిదా పడనుందని వార్తలు వస్తున్నాయి. ఇంతకీ మేటర్ ఏంటంటే… ఈ సినిమా రీషూట్లు నిన్న మొన్నటి వరకు జరుగుతూనే వున్నాయి. పోస్ట్ ప్రొడక్షన్ కు గట్టిగా నెల కూడా సమయం లేదు. అలాగే ప్రస్తుతం కొవిడ్ పరిస్థితుల దృష్ట్యా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఫుల్ స్పీడ్ లో జరగడం అంటే అంత ఈజీ కాదు. ఇవన్నీ ఇలా వుంటే.. ఆర్ఆర్ఆర్ కన్నా ముందుగా చరణ్ నటించిన సినిమా రాకూడదనే ఆచార్య ఫిబ్రవరి డేట్ కు ఫిక్స్ అయ్యింది.
ఇప్పుడు అదే ఆర్ఆర్ఆర్ రాకుండా ఆచార్య విడుదల వుంటుందా అన్నది అతి పెద్ద సందేహం. ఇదిలా ఉంటే.. ఫిబ్రవరి నాటికి కోవిడ్ కేసులు భయంకరంగా పెరుగతాయని హెచ్చరికలు వినిపిస్తున్నాయి. అదే కనుక జరిగితే.. ఖచ్చితంగా ఆచార్య వెనక్కు జరగాల్సిందే. మళ్లీ మార్చి నుంచి ఏప్రిల్ మధ్య సినిమాల రిలీజ్ లు చూసుకుని డేట్ వేసుకోవాల్సి వుంటుంది. ఈ విధంగా ఆచార్య మరోసారి వాయిదా పడడం ఖాయం అని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. మరి.. ఏం జరగనుందో చూడాలి.