‘యానిమల్’ ట్రైలర్ పై ప్రభాస్ ఇన్స్టా పోస్ట్ వైరల్..

అర్జున్ రెడ్డి ఫేం సందీప్ రెడ్డి వంగ, బాలీవుడ్ స్టార్ హీరో రన్‌బీర్ కపూర్ కాంబోలో తెరకెక్కిన హై ఓల్టేజ్ యాక్షన్ మూవీ ‘యానిమల్’. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించింది. తాజాగా ఈ మూవీ నుంచి థియేట్రికల్ ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేయగా, అటు బాలీవుడ్ లో ఇటు టాలీవుడ్ లో ప్రతీ ఒక్కరినీ విపరీతంగా ఆకట్టుకుంది.

అయితే, ఈ ‘యానిమల్’ ట్రైలర్ గురించి పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ తన ఇన్స్టాగ్రాంలో పోస్ట్ పెట్టారు. ట్రైలర్ అద్భుతంగా ఉందని, మంచి ఫీల్.. ఎక్స్ట్రార్డినరీగా ఉందని..ఎప్పుడెప్పుడు ఈ సినిమా చూడాలా..! అనేంత ఆతృతగా ఉందంటూ పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఏకంగా ప్రభాస్ లాంటి హీరో తన ఇన్స్టాలో కామెంట్స్ పెట్టడంతో ‘యానిమల్’ మూవీపై అంచనాలు మరింతగా పెంచుతున్నాయి. ఈ సినిమాను డిసెంబర్ 1వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. కాగా, ఈ మూవీ తర్వాత సందీప్ రెడ్డి వంగా ప్రభాస్‌తో ‘స్పిరిట్’ అనే చిత్రాన్ని తెరకెక్కించనున్నారు.

Related Posts