2500 టికెట్స్ కొంటున్న మంచు మనోజ్, మౌనిక

ఆదిపురుష్ కామన్ ఆడియన్స్ లోనే కాదు.. సెలబ్రిటీస్ లో కూడా సరికొత్త మోటివేషన్ తెస్తోంది. ఇప్పటికే ఈ మూవీకి రణ్‌ బీర్ కపూర్ తో పాటు కొంతమంది బాలీవుడ్ బిగ్గీస్ పదివేల టికెట్స్ కొంటున్నారు. తమ సర్కిల్స్ లో ఉన్నవారికి ఈచిత్రాన్ని వారి సొంత డబ్బులతో చూపించబోతున్నారు. తెలుగు స్టేట్స్ లో ఇప్పటికే శ్రేయస్ మీడియా.. ఖమ్మం జిల్లాలోని రామాలయం ఉన్న ప్రతి ఊరికి 101 టికెట్స్ పంచబోతోంది.

మరి వీరంతా ఇలా చేయడానికి కారణం ఏంటో తెలుసు కదా.. యస్ ఇది రామాయణ గాథ కాబట్టి. పూర్తి రామాయణం చెబుతారా లేక కొన్ని ఘట్టాలను చూపించబోతున్నారా అనేది అప్పుడే చెప్పలేం కానీ.. మొత్తంగా ఈ ఆదిపురుష్‌ మాత్రం ఆడియన్స్ లోకి పూర్తిగా వెళ్లిపోయింది. ప్రభాస్ రాముడుగా నటించడంతో అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. సీత పాత్రలో కృతి సనన్ నటించింది. మిగతా పాత్రల్లోని వారు తెలుగు వారికే కాదు.. సౌత్ ఆడియన్స్ కూ పెద్దగా తెలియకపోయినా.. ఆ పాత్రల్లో నటుల కంటే పౌరాణిక పాత్రలనే చూస్తారు కాబట్టి పెద్దగా సమస్య ఉండదు. ఓమ్ రౌత్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఈ నెల 16న విడుదల కాబోతోంది.

ఈ సందర్భంగా కొత్త జంట మంచు మనోజ్, భూమా మౌనిక కూడా ఆదిపురుష్‌ ను 2500 మంది అనాథ పిల్లలకు చూపించబోతున్నాం అని ముందుకు వచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వివిధ అనాథాశ్రమాల్లో ఉన్న 2500 మంది పిల్లలకు సొంత డబ్బులతో ఆదిపురుష్ చిత్రాన్ని చూపించబోతున్నాం అని ప్రకటించారు.

వీరు ఈ ప్రయత్నాన్ని పాటుగా బృహస్మతి టెక్, నమస్తే వరల్డ్ అనే ఫౌండేషన్స్ తో కలిసి చేస్తున్నారు. మొత్తంగా మంచు మనోజ్, మౌనికలు పెళ్లి తర్వాత తమ సినిమాతో ముందుకు వస్తారు అనుకుంటే ఆదిపురుష్ తో వస్తున్నారు. మరి వీరి సాయంతో అంత మంది పిల్లలు ఆదిపురుష్‌ చూడబోతున్నారన్నమాట.

Related Posts