ట్రైలర్ తో ఆకట్టుకుంటున్న ‘మై నేమ్ ఈజ్ శృతి‘

సీనియర్ బ్యూటీస్ అంతా ఇప్పుడు లేడీ ఓరియెంటెడ్ మూవీస్ పై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఈకోవలోనే ‘దేశముదురు‘ భామ హన్సిక నటించిన చిత్రం ‘మై నేమ్ శృతి‘. వైష్ణవి ఆర్ట్స్ బ్యానర్ పై బురుగు రమ్య ప్రభాకర్ నిర్మించిన ఈ చిత్రానికి శ్రీ‌నివాస్ ఓంకార్ దర్శకుడు. మార్క్ కె.రాబిన్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. నవంబర్ 17న విడుదలకు ముస్తాబైన ‘మై నేమ్ ఈజ్ శృతి‘ మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.

ఆర్గాన్ మాఫియా బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా రూపొందింది. అమ్మాయిలను హత్యలు చేసి వాళ్ల స్కిన్ ను వేరొకరికి గ్రాఫ్టింగ్ చేయడమే ఈ సినిమాలోని మెయిన్ స్టోరీగా ట్రైలర్ ను బట్టి అర్థమవుతోంది. అసలు అమ్మాయిలను హత్యలు చేస్తోందెవరు? వాళ్లను పట్టించడానికి హన్సిక చేసిందేమిటి? అనేదే మిగతా కథ. ‘ఒక అమ్మాయికి జరిగిన ఘోరానికి దేశం మొత్తం స్పందిస్తే.. నిర్భయ అనే చట్టం వచ్చింది. కానీ అదే నిర్భయ దోషులను శిక్షించడానికి టెన్ ఇయర్స్ పట్టింది‘ వంటి డైలాగ్స్ ట్రైలర్ లో ఆకట్టుకుంటున్నాయి.

ఈ సినిమాలో సీనియర్ నటి ప్రేమతో పాటు.. మురళీ శర్మ, పూజా రామచంద్రన్, రాజా రవీంద్ర, ప్రవీణ్, ఆడుకాలమ్ నరేన్ ఇతర కీలక పాత్రలు పోషించారు. మొత్తంమీద.. ట్రైలర్ తో ఆకట్టుకుంటున్న ‘మై నేమ్ ఈజ్ శృతి‘ హన్సిక కి మంచి విజయాన్నందిస్తుందేమో చూడాలి.

Related Posts