బ్రో కు పోటీగానే బేబీ యాత్రలు

ఈ మధ్య కాలంలో టాలీవుడ్ ను బాగా సర్ ప్రైజ్ చేసిన సినిమా బేబీ. చిన్న కంటెంట్ తో పెద్ద కలెక్షన్స్ సాధిస్తోందీ సినిమా. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గానే చెప్పాలి. ఓ ఐదు కోట్ల లోపు బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా ఇప్పటికే యాభై కోట్ల వరకూ కలెక్షన్స్ సాధించింది.

మెగా ఫ్యాన్స్ గా చెప్పుకునే ఎస్కేఎన్ నిర్మించిన ఈ చిత్రాన్ని సాయి రాజేశ్ డైరెక్ట్ చేశాడు. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ కీలక పాత్రలు చేశారు. యూత్ కు బాగా కనెక్ట్ కావడంతో ఈ మూవీ బ్లాక్ బస్టర్ అయింది. అయితే ఈ మెగా ఫ్యాన్స్ ఇప్పుడు సినిమాకు పోటీగా యాత్రలు మొదలుపెట్టారు.

యస్.. బ్రో మూవీకి బాక్సాఫీస్ వద్ద మిక్స్ డ్ టాక్ వచ్చింది. కలెక్షన్స్ కూడా భారీగా ఏం రావడం లేదు. దీంతో సాయితేజ్ ఆంధ్రలో కొన్ని ప్రాంతాల్లో టూర్స్ చేస్తూ సినిమాకు కలెక్షన్స్ పెంచే ప్రయత్నం చేస్తున్నాడు. ఇదేటైమ్ లో ఇప్పుడు బేబీ మూవీ కూడా విడుదలైన మూడువారాల తర్వాత కూడా మళ్లీయాత్రలు మొదలుపెట్టి బ్రో చిత్రానికి మరింత పోటీ ఇస్తున్నాం అని చెప్పకనేచెబుతున్నారు.


నిజానికి ఈ బ్రో వీక్ డేస్ లో కలెక్షన్స్ డల్ అయినా బేబీకి మంచి కలెక్షన్స్ ఉన్నాయి. అయినా ఎస్కేఎన్ ఏ మాత్రం తగ్గకుండా పవన్ సినిమాను మరింత తగ్గిస్తూ తనూ యాత్రలు మొదలుపెట్టాడు. అంటే పైకి మాత్రమే మెగా ఫ్యాన్స్ అని చెప్పడం.. పోటీ వస్తే మెగాస్టార్ అయినా పవర్ స్టార్ అయినా డోన్ట్ కేర్ అనేదే వారి సూత్రమా అంటూ మెగాఫ్యాన్స్ తెగ ఫీలవుతున్నారు. మరోవైపు మెగా హీరోల జోలికి వస్తే ఊరుకోను అనే స్టేట్మెంట్స్ కూడా ఇస్తున్న ఎస్కేఎన్.. ఇప్పుడు మెగా మూవీపై దాడిజరుగుతుంటే ఏం మాట్లాడకుండా.. కామ్ గా తన సినిమా కలెక్షన్స్ కోసం బ్రో కు పోటీగా బేబీతో కలిసి యాత్రలు సాగిస్తున్నాడు. ఏదైనా పేకాట పేకాటే అనే సామెత గుర్తు రావడం లేదూ..

Related Posts