సూర్య తేజ ఏలె నూతన పరిచయం కాగా, మీనాక్షి గోస్వామి ఫిమేల్ లీడ్ చేస్తున్న మూవీ భరత నాట్యం. పీఆర్ ఫిల్మ్స్ బ్యానర్పై పాయల్ సరాఫ్ నిర్మించిన ఈ చిత్రానికి కేవీఆర్ మహేంద్ర డైరెక్టర్. ఈ సినిమా నుంచి ఓ రొమాంటిక్ సాంగ్ ను రిలీజ్ తో పాటు రిలీజ్డేట్ ను కూడా అనౌన్స్ చేసింది చిత్ర యూనిట్.
భరతనాట్యం నుంచి మెయిన్ లీడ్ యాక్ట్ చేసిన రొమాంటిక్ సాంగ్ ‘ఏదో మాయ’ అంటూ సాగే పాటను రిలీజ్ చేసారు. అలాగే ఈ చిత్రాన్ని ఏప్రిల్ 5 న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.
ఈ చిత్రంలో వైవా హర్ష, హర్షవర్ధన్, అజయ్ ఘోష్, సలీం ఫేకు, టెంపర్ వంశీ వంటి అనేక మంది ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.