పూజాహెగ్డే తర్వాత రష్మికను సెట్ చేసిన విజయ్ ..

వరుస సినిమాలతో దూసుకుపోతోంది రష్మిక మందన్నా. తెలుగుతో పాటు హిందీలోనూ ఓ రేంజ్ లో దూకుడు చూపుతోంది. అయితే కన్నడ నుంచి వచ్చిన ఈ కస్తూరికి తమిళ్ లోనూ టాప్ హీరోయిన్ గా వెలిగిపోవాలనే కల ఉండేది. కొన్నాళ్ల క్రితం కార్తి సరసన సుల్తాన్ అనే సినిమాలో నటించినా.. ఆ మూవీ ఫ్లాప్ కావడంతో పెద్దగా ఉపయోగం లేకపోయింది. అయితే తనకు ఇప్పుడు మరో భారీ ఆఫర్ వచ్చింది. కోలీవుడ్ సూపర్ స్టార్ విజయ్ సరసన. అయితే ఈ ఛాన్స్ తెలుగు నుంచే రావడం విశేషం. యస్.. విజయ్ సరసన రష్మికను హీరోయిన్ గా తీసుకున్నారు.
ఇళయదళపతి విజయ్ ఫస్ట్ టైమ్ తెలుగులో నటిస్తోన్న చిత్రంలో అతనికి పెయిర్ గా రష్మికనే ఫైనల్ చేశారు. ఈ విషయాన్ని నిర్మాత దిల్ రాజు క్యాంప్ నుంచి రష్మిక బర్త్ డే సందర్భంగా అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేసే ఈ మూవీతో రష్మికకు కోలీవుడ్ లో రీ ఎంట్రీ మరింత గ్రాండ్ గా ఉంటుందనుకోవచ్చు. అదే టైమ్ లో తన క్రేజ్ విజయ్ కి తెలుగులో ప్లస్ అవుతుంది.
విశేషం ఏంటంటే.. విజయ్ చాలాకాలంగా తెలుగు మార్కెట్ కోసం తెగ ట్రై చేస్తున్నాడు. ఆ క్రమంలోనే పూజాహెగ్డేను తన బీస్ట్ సినిమాలో హీరోయిన్ గా తీసుకున్నారు. బట్ ఈ మూవీ ట్రైలర్ లో తనను మరీ కరివేపాకులా ఉంచారనే విమర్శలు కూడా ఉన్నాయి. మరి రష్మికకు అలా జరగకుండా ఉండేందుకు ప్రయత్నించొచ్చు. అయితే విజయ్ తెలుగు మార్కెట్ ఇప్పుడు ఇక్కడ టాప్ హీరోయిన్లుగా ఉన్న ఈ ఇద్దరు భామలు తెలియకుండానే చాలా హెల్ప్ అవుతుంటారు. మొత్తంగా విజయ్ వరుసగా తెలుగు టాప్ హీరోయిన్లను రిపీట్ చేస్తూ ఇక్కడి మార్కెట్ పై భారీగానే కన్నువేశాడని చెప్పొచ్చు. ఇక ఈ సినిమా ఈ సమ్మర్ లోనే అఫీషియల్ గా ప్రారంభం అవుతుంది.

Image

Image

Image

Related Posts