ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన భారీ పాన్ ఇండియా మూవీ పుష్ప. బన్నీ, సుక్కు ఇద్దరికీ ఇదే ఫస్ట్ పాన్ ఇండియా మూవీ కావడంతో పుష్ప సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అంచనాలకు తగ్గట్టుగా పుష్ప భారీ విజయం సాధించింది. రికార్డ్ కలెక్షన్స్ తో దూసుకెళుతుంది. తెలుగు రాష్ట్రాల్లోనే తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో కూడా మంచి వసూళ్లు రాబట్టింది. ఓవర్ సీస్ లో సైతం రికార్డ్ కలెక్షన్స్ సాధించింది. ఇంతటి భారీ విజయాన్ని సాధించిన సందర్భంగా పుష్ప మేకర్స్ తిరుపతిలో మాసీవ్ సక్సస్ పార్టీ ఏర్పాటు చేశారు.
తిరుపతి లోని ఎస్వీ యూనివర్సిటీ స్టేడియంలో రేపు సాయంత్రం 6 గంటలకు అనగా డిసెంబర్ 21న సాయంత్రం ఈ సక్సెస్ పార్టీ జరగనుంది. ఇందుకు సంబంధించిన పనులు తాజాగా ప్రారంభం అయ్యాయి. బన్నీ అభిమానులు ఈ వేడుకకు భారీ తరలి రానున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. మూడు రోజులకు 173 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి 2021లో బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచి సరికొత్త రికార్డ్ సాధించింది.
అల్లు అర్జున్ సరసన హీరోయిన్ గా రష్మిక మందన్ననటించగా, సునీల్, అనసూయ భరద్వాజ్, ఫాహద్ కీలక పాత్రల్లో నటించారు. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. ఈ చిత్రానికి సంబంధించిన రెండవ పార్ట్ పుష్ప ది రూల్ షూటింగ్ మార్చి నుంచి ప్రారంభం కానుంది. వచ్చే సంవత్సరం దసరాకి లేదా డిసెంబర్ కి పుష్ప పార్ట్ 2 విడుదల చేయనున్నారు. మరి.. పుష్ప 1 ఈ రేంజ్ లో ఉంటే.. పుష్ప 2 ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి.